ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..
గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీ
రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖామంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో 28 లక్షల నిధులతో సిసి రోడ్డు, చిల్డ్రన్ పార్క్, డ్రైనేజీ, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియాలకు శంకుస్థాపన చేశారు.
రైల్వే గేటు పై నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై 15 లక్షల నిధులతో నిర్మించిన మెట్లను ప్రారంభించారు.
అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలనను అందిస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మునిసిపాలిటీలో అభివృద్ధి శూన్యమని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు.
మున్సిపాలిటీ లోని ప్రతి వార్డును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి 25 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చానని గుర్తు చేశారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అవకాశం కల్పించాలని పట్టణ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు మారేపల్లి నరేష్ మంత్రి కి వినతిపత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, వేల్పుల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు పొలం సత్యం, పనాస రాజు, సంఘ రవి, మేకల రమేష్ మహిళా నాయకురాళ్ళు పుష్ప , నాయకులు, యూత్ లీడర్లు ,ప్రజలు పాల్గొన్నారు.