ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి

MJP. MJP.

ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి

హన్మకొండ నేటిధాత్రి:

ఎం జె పి ఆర్ సి ఓ రాజ్ కుమార్ ద్వారా ఎం జె పి కార్యదర్శి డాక్టర్ సైదులుకి వినతి పత్రం అందజేత.బిఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడాపాక రాజేందర్ బోట్ల నరేష్ మాట్లాడుతూ…

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఎంజేపి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు.

వేల సంఖ్యలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోకుండా ఈరోజు నిర్వహించే స్పాట్ కౌన్సిలింగ్ హాజరు కాగా కేవలం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారికే మెరిట్ ప్రకారం అవకాశం కల్పిస్తామని సంబంధిత అధికారులు చెప్పడంతో విద్యార్థులు. 

చాలామంది జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో అవకాశం రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో తండ్రి గాని తల్లి గాని కోల్పోయిన విద్యార్థిని విద్యార్థులకు అవకాశం కల్పించాలని మరియు సంచార జాతులకు చెందిన విద్యార్థులకు. 

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో అవకాశం కల్పించి వారినీ ఆదుకోవాల్సిందిగా ఎం జె పి గురుకుల కార్యదర్శి డాక్టర్ సైదులుని కోరారు.

కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!