రైతు భరోసా విజయోత్సవాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన రైతు భరోసా విజయోత్సవాల 9 రోజులలో 9 వేల కోట్లకు రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు రైతుల నిర్దేశించి ప్రసంగించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఝరాసంగం మండలంలో ఝరాసంగం, కప్పుడ్ మరియు బర్దిపూర్ రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించడం జరిగింది.
రైతు భరోసా పథకం కింద మన మండలానికి 22.83 కోట్లకు గాను ఇప్పటి వరకు 21.04 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుధాకర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశం,శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ మరియు పిఎసిఎస్ ఝారసంఘం చైర్మన్ గౌస్ ఉద్దీన్, మండల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, తాజా మాజీ సర్పంచ్లు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు సృజన పాటిల్, మల్లన్న పటేల్ , మారుతి రావు, శ్రీకాంత్ రెడ్డి రాజ్ కుమార్ స్వామి, రైతులు రఘు శ్రీనివాస్ రెడ్డి, సంగ్రం పాటేల్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు..