గెలిచేది రోహిన్ రెడ్డే!!
`జూబ్లీ హిల్స్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం.
`పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కు జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక సవాల్.
`పిసిసి. అధ్యక్షుడు మహేష్ కుమార్ ఎదుర్కొంటున్న తొలి పరీక్ష.
`జూబ్లీహిల్స్ గెలిస్తే హైదరాబాదు కు మంత్రివర్గంలో చోటుకు స్థానం.
`‘‘నేటిధాత్రి’’ ప్రాథమిక సర్వేలో కూడా రోహిన్ రెడ్డి కావాలంటున్న ప్రజలు.
`ఇప్పటికైతే జూబ్లీ హిల్స్ లో జనం పల్స్ కాంగ్రెస్ వైపే..
`అందరి చూపు రోహిన్ రెడ్డి కోసమే!
`ప్రతిపక్షాలను ఓడిస్తేనే జిహెచ్ఎంసి కైవసం సులభం.
`అధిలార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజల నమ్మకం.
`జూబ్లిహిల్స్ నియోజకవర్గం మీద రోహిన్ రెడ్డికి పట్టు!
`రోహిన్ రెడ్డి నివాసం ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే.
`ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు జూబ్లీ హిల్స్ భాగం.
`అప్పటి నుంచి రోహిన్ రెడ్డికి జూబ్లీ హిల్స్ మీద కూడా పూర్తి పట్టు.
`నిజానికి గత ఎన్నికలలో రోహిన్ రెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలిచేవారు.
`అంబర్ పేట్ నుంచి బరిలోకి దిగినా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.
`ఉప ఎన్నికలో జూబ్లీ హిల్స్ నుంచి రోహిన్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే.
`రోహిన్ రెడ్డి కి పట్టున్న ప్రాంతం..
`అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
`రెండు అంశాలు రోహిన్ రెడ్డికి సానుకూలంగా మారే అవకాశాలు.
`జూబ్లీ హిల్స్ లో సానుభూతి పని చేయొద్దనుకుంటే రోహిన్ రెడ్డి సరైన అభ్యర్థి.
`పైగా సీఎం. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందే అవకాశం.
`సీఎంను ఒప్పించి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడానికి మార్గం.
`సీఎం తో పట్టుబట్టి నిధులు తీసుకురాగల సాన్నిహిత్యం.
`జూబ్లీ హిల్స్ తో పాటు జిహెచ్ఎంసి గెలుచుకోవడం రోహిన్ రెడ్డి తోనే సాధ్యం.
`కనిపిస్తున్న ఆశావహులెవరూ హైదరాబాదుపై పట్టున్న నాయకులు కాదు.
`వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠలో రోహిన్ రెడ్డి దరిదాపుల్లో ఎవరూ లేరు.
-బీఆర్ఎస్ను మరో సారి లేవకుండా చేయాలంటే జూబ్లీ హిల్స్ హస్తగతం కావాలి.
-పార్టీ అధిష్టానం కూడా రోహిన్ రెడ్డి ఎంపికపైనే దృష్టి.
-రోహిన్ రెడ్డి ని గ్రౌండ్ వర్క్ చేసుకొమ్మని చెప్పే ఆ .
-ఆ దిశగా అడుగులేయడానికి రోహిన్ రెడ్డి సిద్ధం.
హైదరాబాద్,నేటిధాత్రి:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక త్వరలో జరగనున్నది. ఆగష్టులో జరగనున్న బిహార్ ఎన్నికలతో నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదు. దాంతో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, ప్రకటన విషయంలో సీరియస్గా వున్నారు. అదికార కాంగ్రెస్పార్టీలో కూడా చాల మంది ఆశావహులున్నారు. కాని అదిష్టానం మదిలో సీనియర్ నాయకుడు రోహిన్ రెడ్డి పేరు పరిశీలనతో వుందని విశ్వసనీయ సమాచారం. పార్టీ కోసం రోహిన్రెడ్డి పడుతున్న శ్రమను అదిష్టానం గుర్తించింది. గత ఎన్నికల్లో రోహిన్రెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఆశించారు. కాని ఆఖరు నిమిషంలో రోహిన్రెడ్డికి అంబర్ పేటను కేటాయించారు. అయినా ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఒక వేళ రోహిన్ రెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తోంది. పాత ఖైరతాబాద్ నియోజకవర్గంపై కాంగ్రెస్లో పూర్తి పట్టున్న ఏకైక నాయకుడు రోహిన్రెడ్డి. ఖైరతాబాద్లో జూబ్లీహిల్స్ కూడా వుండేది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జూబ్లీహిల్స్ ప్రత్యేక నియోజకవర్గమైంది. అయినా రోహిన్రెడ్డికి జూబ్లీహిల్స్లో పట్టుంది. అందుకే రోహిన్రెడ్డికే ఈ సీటు కేటాయించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఆయనకు కాకుండా మరెవరికీ ఇచ్చినా, గెలవాల్సిన సీటు కోల్పోతుందన్న అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే కంటోన్ మెంటు ఉప ఎన్నికతో కాంగ్రెస్కు ఓ సీటు కలిసి వచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ను కూడా హస్తగతం చేసుకోవాల్సిన అవసరం వుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ బలంగానేవుంది. సోషల్మీడియా ప్రచారంలో జరుతున్నదంతా నిజంకాదు. జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్లు ఎక్కువగా వున్నప్పటికీ అవి కాంగ్రెస్కే చెందుతాయి. అందులోనూ సీమాంద్రకు చెందిన ప్రజల ఓట్లు కూడా మేజర్ రోల్ పోషిస్తాయి. ఇక్కడ బిఆర్ఎస్ను, బిజేపిని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఆ రెండు పార్టీలు కూడా బలంగానే వున్నాయి. ఎంఐఎంకూడా ప్రభావిత రోల్ పోషించే అవకాశం లేకపోలేదు. సినీ రంగానికి చెందిన వాళ్లు కూడా కీలకపాత్ర పోషిస్తారు. అందవల్ల తెలుగుదేశం, జనసేన కూడా ఓట్లు వుంటాయన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అందువల్ల ఇక్కగ గెలుపు గుర్రాలను నిలబెడితే తప్ప గెలుపు అన్ని పార్టీలకు అంత సునాయం కాదు. పైగా జరగబోయేది ఉప ఎన్నిక. సాదారణ ఎన్నికలు వేరు. ఉప ఎన్నికలు వేరు. సాదారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రాష్ట్ర మొత్తం మీద దృష్టిపెట్టుకోవాల్సివుంటుంది. కాని ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల యంత్రాంగమంతా అక్కడే తిష్ట వేసి వుంటుంది. రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు, నాయకులు, కార్యకర్తలు కూడా కీలకభూమిక పోషిస్తూ వుంటారు. ప్రచారం జోరుగా నిర్వహిస్తుంటారు. ఏ పార్టీ వెనక్కి తగ్గాలని అనుకోదు. అలా బిఆర్ఎస్, బిజేపిలు తమ అస్త్రశస్త్రాలు వినియోగిస్తాయి. బిఆర్ఎస్ సానుభూతి మీద ఆదారపడ రాజకీయం చేస్తుంది. ఆ పార్టీ యంత్రాంగమంతా కేంద్రీకృతమై ప్రచారం నిర్వహిస్తుంది. అలాగే బిజేపి జాతీయ నాయకులను కూడా ప్రచారానికి వినియోగించే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కీలకమైన ప్రచార అస్త్రాలను ఉపయోగించాల్సి వుంటుంది. అంతకు ముందు బలమైన నాయకుడిని అభ్యర్ధిగా ప్రకటించాల్సి వుంటుంది. అభ్యర్ధుల ఎంపికలో ఏ మాత్రం అటూ ఇటు అయినా మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అదికారంలో వుంది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. పిసిసి. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన నేతృత్వంలో ఎదుర్కోబోతున్న మొదటి ఎన్నిక. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఎక్కువగా వుంటుంది. అంతే కాకుండా రాష్ట్ర వ్యవహారల ఇన్చార్జి నటరాజన్కు కూడా ఇది ప్రతిష్టాత్మక ఎన్నిక. వీరితోపాటు ఈ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంతో కీలకం. అలాంటి సమయంలో అన్ని వర్గాలకు, అన్ని రకాల నాయకత్వాలకు అనుకూలమైన నాయకుడిని ఎంపిక చేయాల్సి వుంటుంది. అందులో రోహిన్ రెడ్డి ఎంపిక గురించే చర్చ జరుగుతోంది. రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరుంది. అందువల్ల రోహిన్ రెడ్డికి టికెట్ ఇస్తే నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రచారం చేసి, గెలిపించే అవకాశం వుంది. లేకుంటే నాయకుల మధ్య వున్న విభేదాలు పార్టీ ఓటమికి కారణం కావొచ్చు. రోహిన్ రెడ్డి అందిరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు. పైగా జూబ్లీహిల్స్లో బాగా పట్టున్న నాయకుడు. ప్రజలతో సత్సంబందాలు వున్న బలమైన నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో పార్టీని గట్టెక్కించగలిగే నాయకుడు కాంగ్రెస్కు లేరు. గతంలో వున్నంత బలంగా ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ లేదనే చెప్పాలి. ఒకప్పుడు ఒంటిచేత్తో హైదరాబాద్ను ఏలిన నాయకులు కాంగ్రెస్లో వుండేవారు. ఈ తరంలో అంతటి బలమైన నాయకుడు ఎవరని వెతికితే ఒక్క రోహిన్ రెడ్డి తప్ప మరొకరు కనిపించడంలేదు. ఇక్కడ కీలకమైన అంశం మరొకటి ముడిపడి వుంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనివార్యం. తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన నియోకజవర్గం. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక తర్వాత డిసెంబర్ , జనవరిలో జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగే అవకాశం వుంది. గతంలో ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిద్యం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. 2004కు ముందు బిఆర్ఎస్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా భయపడిన రోజులన్నాయి. ఎన్నికల నుంచి తప్పించుకున్న కాలం కూడా వుంది. కాని కాంగ్రెస్ ఎప్పుడూ అలా పారిపోలేదు. పోరాట పటిమ కాంగ్రెస్కు మించి ఏ పార్టీకి వుండదు. గత రెండు దఫాలుగా జిహెచ్ఎంసిపై జెండా ఎగురవేయని కాంగ్రెస్ అధికారంలో వుండి కూడా గెలవకపోతే తప్పుడు సంకేతాలువెళ్తాయి. అందువల్ల ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఆరు నూరైనా గెలవాలి. అందులో రోహిన్రెడ్డి మాత్రమే గెలిచే అవకాశాలున్నాయి. ఈ విషయంలో నేటి ధాత్రి గత కొంత కాలంగా ప్రాధమిక సర్వే నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్ధి ఎవరైతే బాగుంటుందన్న దానిపై సర్వే నిర్వహించడం జరిగింది. ప్రజలకు కొన్ని పేర్లు సూచిస్తే మెజార్టీ ప్రజలు రోహిన్ రెడ్డి పేరునే సూచించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రోహిన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయం మేరకు పార్టీ అభ్యర్ధిగా రోహిన్రెడ్డిని ఎంపిక చేస్తే గెలుపు నల్లెరు మీద నడకే అవుతుందంటున్నారు. హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు మంత్రి వర్గంలో ఎవరూ ప్రాతినిద్యం వహించడం లేదు. ఈ సారి ఉప ఎన్నికల్లో గెలిచే కాంగ్రెస్ అభ్యర్ధికి మంత్రి పదవి ఖాయం. హైదరాబాద్కు మంత్రి వర్గంలో చోటు అత్యవసరం. జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందే మంత్రి వర్గంలో హైదరాబాద్ ఎమ్మెల్యేకి చోటు కల్పించాల్సిన అవసరం వుంటుంది. అందుకే ప్రయోగాలు చేయకుండా, లేని పోనివివాదాలకు కాంగ్రెస్ కేంద్ర బిందువు కాకుండా వుండాలి. ఏ ఇతర సభ్యులను పరిగణలోకి తీసుకున్నా కాంగ్రెస్లో వివాదాలు ముసిరే అవకాశం వుంది. అవి ప్రతిపక్షాలకు అనుకూలమయ్యే ప్రమాదం కూడా వుంది. అటు ప్రతిపక్షాలను కట్టడి చేస్తూ, ఇటు ప్రజల విశ్వాసం చూరగొంటూ ఎన్నికల్లో ముందుకు సాగాల్సిన అవసరం వుంది. ఇక్కడ ప్రజలు కూడా బాగా ఆలోచించే అంశాలు కూడా కొన్ని వున్నాయి. రోహిన్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరింత అభివృద్ది చెందేందుకు దారులు పడతాయి. ఇప్పటి వరకు పెండిరగ్లో వున్న అన్ని రకాల సమస్యలు తీరుతాయి. మంత్రి కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో వుండే పరిస్ధితి వుంటుంది. నగరంలో కాంగ్రెస్ బలోపేతానికి అడుగులు పడుతుంటాయి. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాకుండా, హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాలు మరింత అభివృద్ది చెందేందుకు అవకాశాలుంటాయి. నగర అభివృద్ది కోసం మరిన్ని నిధులను తెచ్చే అవకాశం వుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత్యంత సన్నిహితుడు కావడం వల్ల ఎమ్మెల్యేగా రోహిన్ రెడ్డి గెలిస్తే ఇతోదిక నిధులు తెచ్చి, అటు తన సొంతనియోజవర్గంతోపాటు, హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుంది.