కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ
ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా సాగుతుంది
*వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ
మొగుళ్ళపల్లి నేటిధాత్రి:
తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలన్న ఆలోచన మేరకు 9 రోజుల్లో పెట్టుబడి సాయం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం నిధులు విడుదల చేసిన ప్రజా ప్రభుత్వం
వానాకాలం సీజన్లోపంటకు పెట్టుబడి రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో పూర్తిచేసి ప్రజా ప్రభుత్వంలో రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని చిట్యాల వ్యవసాయం మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ అన్నారు .ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులో 9 వేలకోట్ల రూపాయలు కోట్లరూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి వర్గానికి
అందరికి ధన్యవాదాలు తెలిపారు.గతంలో ఎకరాకు పది వేల రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరాకు 12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించామని నిధుల విడుదల చేశామన్నారు