శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు
నాగారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేటి ధాత్రి:
జూన్ 23 నుండి జూలై 6 వరకు శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ నుండి జన్మదిన వరకు జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర మహిళా మోర్చా పిలుపుమేరకు మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ వేణుగోపాల్ ఆద్వర్యంలో నాగారం మున్సిపాలిటీ ఆర్ ఎల్ నగర్ శ్రీ స్వయంభు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అమ్మ పేరు మీద మొక్క నాటే కార్యక్రమం మరియు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ సెక్రెటరీ మాధవి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనన్న, నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ శ్యాంసుందర శర్మ, శ్రీనివాస్ గౌడ్
సీనియర్ బిజెపి నాయకులు రవీందర్ రెడ్డి, పోతంశెట్టి, సురేందర్ , శ్రీనివాస్,జ్యోతి పాండే శైలజ ,విజయలక్ష్మి ,శారద మరియు మండల మహిళలు, మహిళ మోర్చా నాయకురాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.