ఎటూ పోయావు వానమ్మా…
రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు
శాయంపేట నేటిధాత్రి:
జూన్ మాసం వచ్చి 20 రోజులు గడిచిన తొలకరి పలకరించలేదు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం రోజు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. మేఘాలు వర్షం రావడం కరుణించకపోవడంతో వానకాలం పంట సీజన్ ఆరంభంలో నిరాశ చెందు తున్నారు. ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు నష్ట పోవలసిన పరిస్థితి వస్తుంది ఒక నెల ముందుగానేప్రారంభిం చాలని దిశ నిర్దేశం చేసింది. చినుకులు లేకపోవడంతో విత్తనాలు విత్తకుంటే అధిక దిగులు వస్తాయని రైతులు ఆలోచించారు ఎప్పటిలాగే రైతులు వానాకాలంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేకపోయింది. మేఘాలు మొఖం చాటేసుకోవ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమ్ముకోవా లని నానా కష్టాలు పడి అమ్ముకుంటే జూన్ నెలలో విత్తనాలు వేసుకుంటే రైతన్నలకు వాన కాలంలో అనావృష్టి వెంటాడుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాకే నల్లరేగడిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో రైతులు వర్షం వస్తుందని నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి ఎదురు చూస్తున్నారు ఈసారి ఎండ తీవ్రత విపరీతంగా ఉండడం తో మండలంలోని చెరువులు కుంటాను నీళ్లు లేక విలవిల బోతున్నాయి ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాల్లో ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడు దీవెనలు కోసం ఎదురుచూ డాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎదురుచూస్తున్నాం..
మండలం రైతు ముసికే అశోక్
వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం సీజన్ లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతకొచ్చే సమయంలో వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టం పరుస్తుంది ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షాలు రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.