సంక్షేమ సారధి మంత్రి సీతక్క…
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు…
సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…
మంగపేట-నేటిధాత్రి
సంక్షేమ సారధి మంత్రి సీతక్క అని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు శుక్రవారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల కి ముగ్గులు పోసి నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో మంజూరు కానీ పేదవాడి సొంతింటి కలని నేడు మంత్రి సీతక్క సాకారం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు మొదటి విడతలో అకినేపల్లి మల్లారం గ్రామ పంచాయతీ కి మొత్తం పదమూడు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే మరో విడతలో అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ పక్కా ఇండ్లు మంత్రి సీతక్క సహకారంతో మంజూరు అవుతాయని అర్హులైన వారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సాంబశివరెడ్డి అన్నారు ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు సేవలు అందించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధూళిపాల బాలకృష్ణ కటుకూరి శేషయ్య శెట్టిపల్లి నర్సింహారావు రవి సాంబశివరావు రాజు శెట్టిపల్లి పూలమ్మ గ్రామపంచాయతీ సిబ్బంది చెట్టిపల్లి వెంకటేశ్వర్లు ఇందిరమ్మ లబ్ధిదారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు