ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

Congress Congress

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

#యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు…

#ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే నాయిని,రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్…

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ భవన్/హనుమకొండ
పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత,ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం రోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.యువజన కాంగ్రెస్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దానం శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్ శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రాహుల్ గాంధీ జన్మదినం ఓ మంచి కార్యక్రమం కావాలని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.దాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర దేశం నుంచి నేటి వరకు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న ఏకైక కుటుంబమని,రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రేషన్ కార్డులు,ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి ఎన్నో పథకాలతో నేడు పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఈ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!