హైకోర్టు ఆర్డర్ ను ధిక్కరించిన ఎన్పీడీసీఎల్?
దళితుల భూమిలో సబ్ స్టేషన్ అక్రమ నిర్మాణం.
ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో బోర్ వేస్తుండగా ఆపివేసిన దళితులు..
100 కు దయల్ చేసిన దళితులు.. బోర్ వెల్ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలింపు.
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
గీసుకొండ మండలంలోని గొర్రెకుంట దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 భూమిలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టే క్రమంలో వెంటనే గ్రహించిన (ఎస్సి – సి) మాల దళిత కులస్తులు హైకోర్టును ఆశ్రయించారు.కాగా పిర్యాదులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దళితులకు కాకుండా మరే ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని స్టే ఆర్డర్
జారీచేసింది.ఐనప్పటికీ హైకోర్టు ఆర్థర్ ను ధిక్కరిస్తూ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సదరు కాంట్రాక్టర్ గురువారం పనులను ప్రారంభించేందుకు గాను ముందుగా రెండు బోర్ వెల్ వాహనాలతో బోర్లు వేయడం ప్రారంభించారు. వెంటనే గమనించిన దళిత మాల కులస్తులు పోలీస్ 100 కు సమాచారం ఇచ్చి పనులను ఆపే ప్రయత్నం చేశారు. దళితుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు

బోర్ వెల్ వాహనాలను సీజ్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గొర్రెకుంట దళిత మాల కులస్తులు బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్ లు మాట్లాడుతూ గీసుకొండ మండలంలోని గొర్రెకుంట గ్రామంలో గల సర్వే నెంబర్ 55 భూమిలో గత డెబ్బై ఏండ్ల క్రితం నుండి మా దళితులు వ్యవసాయం సాగుచేసుకునేవారని అన్నారు.కాల క్రమేణా మూడు దశాబ్దాలకు నిరుపేదలమైన మా దళితమాల కులస్తులకు పునరావాసం లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో అదే సర్వే నెంబర్ 55 భూమిలో దళితుల అవాసాల కోసం ఇండ్ల నిర్మాణాలు చేపట్టుకోవడానికి ఆనాటి అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని వారు పేర్కొన్నారు.మాల దళితులకు కేటాయించిన భూమిలో నిర్మాణాలు చెప్పటాలని కొందరు వ్యక్తులు పన్నాగాలు పన్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే భూమిని అక్రమంగా స్వాదీనం చేసుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం నిర్మాణాలు చేపట్టారని అవేదన వ్యక్తం చేశారు.మాల దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను సంబంధిత విద్యుత్ సంస్థకు,అధికారులకు అందించామని ఐనప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ టీఎస్ 08 ఇ.పి 1974 , టీఎస్ 16 ఇపి 7413 గల బోర్ వెల్ వాహనాలతో అక్రమంగా బోర్లు వేస్తున్నారని ఆరోపించారు.వెంటనే పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 100 కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బోర్ వెల్ పనులను ఆపివేసి వాహనాలను సీజ్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారని బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్ తెలిపారు.కాగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎంపీడీసీఎల్ ఎస్ఈ లకు పిర్యాదులు చేయనున్నట్లు అలాగే గీసుకొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 గల ప్రభుత్వ భూమిని దళితులకే కేటాయించాలని

ఈ సందర్భంగా బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్,మద్దెల క్రాంతి కుమార్,బందెల రణధీర్,బందెల అరుణ్,బందెల రాజశేఖర్,బందెల వంశీ,బందెల రమేష్,సిరిమిల్ల శరత్ చంద్ర,
కొత్త శివశంకర్ పలువురు దళితులు కోరారు.