విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు.

MPDO. MPDO.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

ఎంపిడిఓకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ బృందం

పరకాల నేటిధాత్రి:

 

గత సంవత్సరం పదవ తరగతిలో పరకాల మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషకం అందచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు.

పరకాల నేటిధాత్రి
2024,25 విద్యా సంవత్సరం లో పట్టణంలోని బాలికల పాఠశాల నుండి ఎం.వర్షిత 557,జడ్పిహెచ్ఎస్ నాగారం,వి.విజ్ణేష్ 530ప్రభుత్వ ఉన్నత పాఠశాల,సిహెచ్ అజయ్ 455 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరకాల నుండి జి రవితేజ 453 మార్కులు మరియు జడ్పి.హెచ్ఎస్ వెల్లంపల్లి నుండి చిన్నారి 370 మార్కులు సాధించిన సందర్బంగా విద్యార్థులకు పరకాల యంపీడీఓ పెద్ది ఆంజనేయులు తమ తల్లి తండ్రి పెద్ది బాలమణి చంద్రమౌళి జ్ఞాపకార్థం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఉపాధ్యాయునిగా పని చేస్తూ మరణించినందున.

MPDO.

ఈ ఉద్యోగం వచ్చింది అని తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా,విద్యార్థులకు తన స్థాయికి తగిన విధంగా సహకారం అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల విద్యాశాఖ అధికారి ఎస్ రమాదేవి,మండల నోడల్ అధికారి నామిని సాంబయ్య కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మధు,సిహెచ్ సురేందర్ ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని అనునిత్యం విద్యాశాఖకు వెన్నుదన్నుగా నిలిచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీడీవోకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!