ప్రైవేటు యాజమాన్యాల ఫీజు దోపిడిని అరికట్టాలి.

Sekhar Goud. Sekhar Goud.

ప్రైవేటు యాజమాన్యాల ఫీజు దోపిడిని అరికట్టాలి.

కల్వకుర్తి  నేటి ధాత్రి:

గురువారం కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ మాట్లాడుతూ..
– కార్పొరేట్ విద్యతో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి.
– సామర్థ్యాలు లేని బస్సులను సీజ్ చేసి విద్యార్థుల జీవితాలను ప్రాణాలను కాపాడాలి.
– విద్యను వ్యాపారంగా చేసి పాఠశాలల్లోనే పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలు తనిఖీలు చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి.
– తెలంగాణ రాష్ట్రంలో నేటికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేటు.తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య పేరుతో పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మలచుకొని అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠశాలలోనేపుస్తకాలను ,యూనిఫామ్ లను అమ్ముతూ డబ్బులను దండిగా సంపాదిస్తున్న ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు పాటించే విధంగా తరగతి గదుల వసతులు సరిగా లేని పాఠశాలలను రద్దు చేయాలని గణేష్ అన్నారు.విద్యను బోధించే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్హతను చూడాలి, పాఠశాల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి, సామర్థ్యం లేని బస్సులను నడుపుతున్న ప్రైవేటు బస్సులను సీజ్ చేసి ఆ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని గణేష్ డిమాండ్ చేశారు.విద్యారంగం పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి.అదేవిధంగా బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి.నేడు ఒక్కొక్క కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల రూపాయలు పెండింగ్ పడడంతో విద్యా వ్యవస్థ నాశనం అయిందని.అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి కళాశాలలో దిగజారాయని ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యావ్యవస్థను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గణేష్ కోరారు.గురుకుల సామర్ధ్యాలు పెంచి, మంచి నాణ్యమైన భోజనాన్ని వసతులను కల్పించాలని, గురుకులల్లో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మనోధైర్యాన్ని నింపాలని దారమోని గణేష్ డిమాండ్ చేశారు.వృత్తి విద్య పేరుతో నైపుణ్యాన్ని నింపుతామని శంకుస్థాపన చేసి ఇప్పటికీ మొదలు కాకపోవడం ఏంటని దారమోని గణేష్ ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని వెంటనే పాఠశాలలు తనిఖీలు నిర్వహించాలని లేకుంటే తెలంగాణ జాగృతి,BRSV పక్షాన విద్యారంగం పైన దీక్షలు చేపడతామని దారమోని గణేష్ ప్రకటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, పెరుమాళ్ళ కృష్ణ , పరశురాములు, సైదులు,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!