ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక.

Election Election

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక. చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
నేర్పటి శీను కుమ్మరి శ్రీనాథ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మొగులపల్లి మండల ఇన్చార్జి MRPS నేరెళ్ల ఓదెలు మాదిగ.కో ఇన్చార్జీలు రేణికుంట్ల సంపత్ మాదిగ. రామ్ రామ్ చందర్ మాదిగ . మొగులపల్లి మండల.ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి మాదిగ. జీడి సంపత్ మాదిగ ఆధ్వర్యంలోMRPS ముఖ్య కార్యకర్తల సమావేశ నికి ముఖ్య అతిథులుగా మొగులపల్లి మండల ఇన్చార్జ్ నేరెళ్ల ఓదెలు మాదిగ. కో ఇన్చార్జి రేణికుంట్ల సంపత్ మాదిగ లు హాజరై వారు మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత , పద్మశ్రీ అవార్డు గ్రహీతమంద కృష్ణ మాదిగతన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లోవెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు. ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారామాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.
ఇసిపేట గ్రామ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది
గౌరవ అధ్యక్షులుగా. జన్నె సదయ్య.మాదిగ
అధ్యక్షులు : నేర్పట్టి శీను మాదిగ
ఉపాధ్యక్షులు : జన్నె క్రాంతి మాదిగఅధికార ప్రతినిధిగా. బొచ్చు రాకేష్ ముఖ్య సలహాదారులుగా. నేర్పాటి శ్రీను మాదిగ. జన్నెమొగిలి మాదిగ ప్రధాన కార్యదర్శి : బొచ్చు రాజు మాదిగ కార్యదర్శి : నేర్పట్టి అశోక్ మాదిగ కోశాధికారిక. గడ్డం చిరంజీవి మాదిగ.
ప్రచార కార్యదర్శిగా నేర్పటి రాజయ్య మాదిగ
సంయుక్త కార్యదర్శిగా. గడ్డం
రాజు. మాదిగ లను
చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.అధ్యక్షులుగా. కుమ్మరి శ్రీనాథ్ఉపాధ్యక్షులుగా. శ్రావణ్అధికార ప్రతినిధిగా. అజయ్ ప్రధాన కార్యదర్శిగా. ప్రభాస్కార్యదర్శిగా. రాంబాబు
కోశాధికారిగా. అంతడుపుల రాజు
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి జీడి సంపత్. రొంటాల రాజ్ కుమార్. జంపయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!