బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం.

Bike accident Bike accident

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దసరాపు భద్రయ్య కు ముత్యాల సంపత్ కు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది దీనితో వారికి తలకు బాడీకి తీవ్రమైన దెబ్బలు తగలడంతో హైదరాబాదులోని హాస్పిటల్ తీసుకువెళ్లడం జరిగింది వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబం దాతల సహకారం కోరగా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్నికి మనోధైర్యం కల్పించి వారి వైద్యానికి 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ ఆకుల ప్రతాప్,మొర్రి గణేష్, తది ఇతర సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!