కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

 

 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అడ్వాన్సెడ్ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బి విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెదిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఇండో-పసిపిక్ సముద్ర జలాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

 

 

 

తిరువనంతపురం: బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-35బి (F-35B) లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గత శనివారం రాత్రి ల్యాండ్ అయింది. నాలుగవ రోజైన బుధవారంనాడు కూడా విమానం అక్కడే నిలిచిపోయింది. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

 

 

 

 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అడ్వాన్సెడ్ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బి విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఇండో-పసిపిక్ సముద్ర జలాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల భారత నౌకాదళంతో సంయుక్త విన్యాసాలు ముగించుకుంది. అనంతరం ఇంధనం తక్కువ కావడంతో తిరువనంతపురం విమానాశ్రయానికి ఈ విమానాన్ని మళ్లించారు. అయితే విమానం హైడ్రాలిక్ సిస్టమ్స్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు ఆ తర్వాత గుర్తించారు. బ్రిటిష్ ఏవియషన్ ఇంజనీర్లు ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారు. ఇందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం విమానం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!