బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
జాతీయ హక్కుల పోరాట సమితి డిమాండ్
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా సీసీసీ కార్నర్ లో బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా కామారెడ్డి లో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారం లోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని,5 ఏళ్లలో బీసీ ల సంక్షేమాన్ని లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ లు 42% పెంచుతామని,ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని,అన్నీ జిల్లా కేంద్రాల్లో బీసీ భావనాలు నిర్మిస్తామని,అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం నర అవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయక పోవడం అంటే ఇది బీసీ సమాజాన్ని మభ్య పెట్టడమే అవుతుంది అని అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి గా డిమాండ్ చేస్తూన్నాం.లేకపోతే ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్లి బీసీ సమాజం ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతామని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ములశ్రీనివాస్, గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మదనబోయిన రాజన్న యాదవ్,నాయకులు శాఖపురి భీంసేన్,సీపతి రాములు, అంకం సతీష్,చెలిమెల అంజన్న తదితరులు పాల్గొన్నారు.