రైతన్న మళ్ళీ మోసపోతే గోస పడతారు.

Farmer Farmer

రైతన్న మళ్ళీ మోసపోతే గోస పడతారు

స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులకు రైతు భరోసా ఎరవేస్తున్న ప్రభుత్వం

శాయంపేట నేటిధాత్రి:

shine junior college
shine junior college


శాయంపేట మండలం మైలా రం గ్రామంలో మండల పిఏసి యస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులకు రైతు భరోసా ఎరవే స్తున్న ప్రభుత్వం. 18 నెలలు కాంగ్రెస్ పాలన వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నది రైతులు సాగునీరు లేక రైతు బంధు పెట్టుబడి పైసలు లేక పండించిన ధాన్యం కొనక ఉచిత ఎరువులు జాడలేక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఈరోజు వరకు దాదాపు 600 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత ప్రభుత్వం లో రోజు లాగా బతికిన రైతు నేడు గోస బడుతూ చస్తూ బతుకుతున్నాడు ఈ పరిస్థితి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి రైతులను పట్టించుకోకపోవడం రైతుబంధు లాంటి పథకాన్ని ఆపేసి రైతు భరోసా తీసుకొస్తా మని కాలయాపన చేయడమే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు భరోసా పైసలకు ఆశపడి రైతులు మరోసారి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే మళ్ళీ గోస పడే పరిస్థితి ఏర్పడతా యని రైతులు భావిస్తున్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో రైతు భరోసా ప్లాన్ పని చేస్తుందో లేదో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!