సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులుగా ఎండి జాఫర్ కృష్ణ ఎన్నిక…
భూపాలపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి సిపిఐ 18వ పట్టణ మహాసభలో భూపాలపల్లి పట్టణ కమిటీ ఎన్నుకున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజకుమార్ తెలిపారు. పట్టణ మహాసభలో భూపాలపల్లి పట్టణ అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్,ఇందిరమ్మ ఇండ్లు,వృధ్యప్ప, వితంతువు మహిమ పింఛన్లు మంజూరు చేయాలనీ కోరారు. సిపిఐ భూపాలపల్లి పట్టణ నూతన కమిటీని 27మంది తో ఎన్నుకున్నట్లు తెలిపారు.

పట్టణ కార్యదర్శిగా సోతుకు ప్రవీణ్ కుమార్ సహాయ కార్యదర్శిలుగా ఎండి జాఫర్, పల్లి కృష్ణను నియమించారు.
కార్యవర్గ సభ్యులుగా మోటపలుకుల రమేష్ గురిజపల్లి సుధాకర్ రెడ్డి రాంచంధర్ జి శ్రీనివాస్ క్యాతరాజ్ సతీష్ కోరిమి సుగుణ నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ లతోపాటు కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు రాజకుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ సహాయ కార్యదర్శులు ఎండి జాఫర్ కృష్ణలు మాట్లాడుతు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.