గత పదేళ్లలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చని దర్యాప్తులు!
-ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తులు!
-తూతూ మంత్రంగా తనిఖీలు!
-కొంత కాలం హడావుడీ కార్యక్రమాలు!
-ఏదో జరుగుతోందన్నట్లు ప్రకటనలు.
-లెక్కలు తేల్చినట్లు రిపోర్టులు!
-బుట్ట దాఖలు చేసి అక్రమార్కులకు అండదండలు.
-విచిత్రమేమిటంటే ఆరోపణలు ఎదుర్కొన్న వాళే విజిలెన్స్ అధికారులు!
-రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలు చేసేది, చేయించేది వాళ్లే?
-విజిలెన్స్ అధికారులుగా వచ్చి లెక్కలు చూసేది వాళ్లే!
-ఆ ఫైల్ను తమ టేబుల్ మీద పెట్టుకునేది వాళ్లే!
-దొంగ చేతికి తాళమివ్వడమంటే ఇదే!
-ఇలా పదేళ్లలో వందల ఎంక్వౌరీలు జరిగాయి!
-ఏ ఒక్కరికి కూడా శిక్షపడిన దాఖలాలు లేవు.
-గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖలలో విచ్చలవిడి అక్రమాలు.
??మైనింగ్ పేరు చెప్పి ఇసుకాసురులు రెచ్చిపోయారు!??
-వారికి అధికారులు వంత పాడారు!
-ఎంక్వౌరీలు వేసి ఎంతో మందిని దోషులుగా తేల్చారు!
-చర్యలు తీసుకోవడం వదిలేశారు..పైగా ప్రమోషన్లు కూడా ఇచ్చారు.
??గ్రానైట్ తవ్వకాలలో లెక్కలేనంత అక్రమాలు జరిగాయి.??
??వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు.??
-‘‘నేటిధాత్రి’’ కొన్ని వందల కధనాలు రాసింది.
-గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
-ఇప్పటికీ మించిపోలేదు..
-ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి నుంచి కక్కిస్తే చాలు.
-ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఓ వైపు వేలు, లక్షల్లో జీతాలు తీసుకుంటే అడుగుడునా అవినీతి చేసుకుంటూ, కోట్లు సంపాదించిన ఉద్యోగులున్నారు. ఉద్యోగుల సహకారంతో వందల కోట్లు సంపాదించిన వ్యాపారులున్నారు. ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, అటు వ్యాపారులు నుంచి పెద్దఎత్తున ముడుపులు తీసుకున్న ఉద్యోగులు అనేక శాఖలో వందల మంది వున్నారు. మరి అలాంటి వారికి శిక్షలు పడలేదా? అంటే పడలేదు. వారిపై చర్యలు తీసుకోలేదు. కారణం వారికి రాజకీయ పార్టీ నాయకులతోడు, ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా వుండడంతో ఇలాంటి అవినీతి కార్యకలాపాలు పెద్దఎత్తున జరిగిన సందర్భాలు అనేకం వున్నాయి. అలా తెలంగాణలో ఈ పదేళ్లకాలంలో జరిగిన అవినీతి కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్, మైనింగ్ ,వైద్య శాఖల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు తేలింది. అవినీతి ఆరోపణలు రాగానే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వౌరీ వేయడం, అదికారులు వెల్లడం తూతూ మంత్రమైపోయింది. కొన్ని సార్లు ఒక రోజు, మరికొన్ని సార్లు మూడు నాలుగు రోజులు హడావుడి చేసి, వందల పేజీల ఎంక్వౌరీ రిపోర్టులు తయారు చేసిన సందర్బాలు కూడా అనేకం వున్నాయి. కాని ఫలితం ఏం జరిగింది? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుంది. ఆ ఎంక్వౌరీ రిపోర్టు బుట్టదాఖలౌతోంది. ఇదే తంతు. గత పదేళ్ల కాలంలో అనేక ఎంక్వౌరీలు జరిగాయి. వాటిని నేటిదాత్రి అనేక సార్లు రాసింది. కాని ఏం జరిగింది? ఎంక్వౌరీ చేయడం దగ్గరే ఆగిపోయింది. ఎంక్వౌరీ రిపోర్టు బైట పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. అయినా ఎక్కడా ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నది లేదు. ఏ అక్రమ వ్యాపారి మీద చర్యలు లేవు. ఇలా పదేళ్ల కాలంలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. ప్రబుత్వానికి రావాల్సిన రాయల్టి కూడా అందకుండా పోయింది. వ్యాపారులు హైదరాబాద్లో పెద్దఎత్తున ఆస్ధులు కూడబెట్టుకున్నారు. ఉద్యోగులు కూడా హైదరాబాద్లో ఆస్దులు పోగేసుకున్నారు. కాని వారి మీద ఈగ కూడా వాలలేదు. వాటిలో కొన్ని మచ్చుకు చెప్పుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దఎత్తున గ్రానైట్ వ్యాపారం సాగుతుంది. ఒక్క కరీంనగర్ పట్టణ చుట్టుపక్కలే కొన్ని వందల క్వారీలలో గ్రానైట్ వ్యాపారం సాగుతోంది. ఇక్కడి నుంచి విదేశాలలకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తరలిపోతుంది. అలా గ్రానైట్ వ్యాపారం సాగించే వ్యాపారులందరూ రాయల్టీ పెద్ద ఎత్తున ఎగవేతదారులే. అందులో బడాబడా వ్యాపారులే కాదు, రాజకీయ నాయకులు కూడా వున్నారు. దాంతో అదికారులు ఆ వ్యాపారాల వైపు తొంగి చూడరు. వాళ్లు చెప్పిందే రాసుకుంటారు. క్షేత్ర స్దాయి పరిశీలన జరగదు. ప్రభుత్వ అనుమతులు ఎంత వరకు వున్నాయి. వ్యాపారులు ఎంత వ్యాపారంచేస్తున్నారు. ప్రభుత్వం ఎంత స్థలానికి పర్మిషన్ ఇచ్చింది. వ్యాపారులు ఎంత స్ధలంలో గ్రానైట్ తవ్వకాలు సాగిస్తున్నారు. అనేది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అదో మాయా ప్రపంచం అనికూడా నేటిధాత్రి అనేక కధనాలు రాసింది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన స్ధలం పక్కన దళిత రైతుల భూములు కూడా తీసుకొని గ్రానైట్ వ్యాపారం సాగిస్తున్నకంపనీలున్నాయి. కంపనీలు సాగిస్తున్న వ్యాపారంపై ప్రభుత్వం పూర్తి స్ధాయి దృష్టిపెట్టాల్సిన అవసరంవుంటుంది. గ్రానైట్ కంపనీల మూలంగా వ్యాపారికి తప్ప ప్రభుత్వానికి కూడా పెద్దగా రాయల్టీ అందడం లేదు. పైగా పర్యావరణం పాడౌతోంది. చెరువులు ఆనవాలులేకుండాపోతున్నాయి. వ్యవసాయ పొలాలు ఆగమౌతున్నాయి. గ్రానైట్ రాళ్ల రవాణ వల్ల ప్రజలకు అనేక అవస్దలు ఎదుర్కొంటున్నారు. ఇలా ప్రజలుకూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా లెక్కకు మించి గ్రానైట్ తవ్వకాల జరుపుతున్న కంపనీలపై విజిలెన్స్ ఎంక్వౌరీలు జరిగాయి. కాని రిపోర్టులు కూడా సమర్పించారు. కాని ఆయా కంపనీలపై చర్యలు తీసుకున్నది లేదు. వ్యాపారుల చెల్లించాల్సిన రాయల్టీ వసూలు చేసింది లేదు. కింది స్ధాయి అదికారుల నుంచి పై స్ధాయి దాకా అదికారులు అవినీతి మూలంగా ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ము మధ్యలోనే మాయమౌతోంది. విజిలెన్స్ రిపోర్టులు మరుగున పడిపోతున్నాయి. ఇక రాష్ట్రంలో ఇసుక వ్యాపారం ఒక పెద్ద మాయా ప్రపంచం. ఈ గ్రానైట్ వ్యాపారం కరీంనగర్తోపాటు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పెద్దఎత్తున జరగుతుంది. ఈ మూడు జిల్లాల్లో అనేక సార్లు ఎంక్వౌరీలు జరిగాయి. కాని రాయల్టి వసూలు చేసింది లేదు. మొత్తం ఈ వ్యవస్ధలో పూర్తిస్దాయి ఎంక్వరీలు చేపడితే ప్రభుత్వానికి వేల కోట్లు చేరుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఉమ్మడి కరీంనగర్లో గతంలో గోదావరి నది మీద జరిగే అక్రమ వ్యాపారంపై పెద్దఎత్తున నేటి దాత్రి స్టోరీలు రాసింది. ఇసుక వ్యాపారం మొదలు పెట్టినప్పుడు చిన్న స్ధాయి వ్యక్తులంతా డాన్లుగా మారిన సందర్భాలున్నాయి. అలాంటి వారిలో ఒక డీలర్గా పనిచేసిన వ్యక్తి , ఇసుక వ్యాపారంచేసి డాన్ శ్రీను అనేంత పేరు సంపాదించుకున్నాడు. అలా అదికారులు అతనికి సహకరించారు. ఈపదేళ్ల కాలంలో వందలకోట్ల రూపాయలు ఆ వ్యక్తి సంపాదించాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ కోట్లలో ఎగ్గొట్టాడు. ఈ విషయం అధికారులందికీ తెలుసు. దానిపై విచారణ కూడా జరిగింది. కాని రాయల్టీ వసూలు చేసిన దిక్కులేదు. ఇలా ఇసుక వ్యాపారులు ఎంతో మంది ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ వందల కోట్లలో వుంటుంది. ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై గతంలో అనేకసార్లు విజిలెన్స్ ఎంక్వౌరీ జరిగింది. రిపోర్టులు కూడా సమర్పించారు. కాని ఏం జరిగింది? ఏ ఒక్కరి మీద కూడా కేసు నమోదు జరగలేదు. వారికి శిక్షపడిరది లేదు. అలా ఇసుక వ్యాపారం సాగిస్తున్న వారిపై వున్న రాయల్టీ వసూలుకు ఇప్పటికైనా పూనుకుంటే కొన్ని వందల కోట్లు వసూలుచేయొచ్చు.అది ఆ ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయమే. కాని కరీంనగర్తోపాటు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్లో పెద్దఎత్తున ఇసుక వ్యాపారం సాగుతుంది. భూపాల పల్లి నుంచి పెద్దఎత్తున ఇసుక తరిలిపోతుంది. ఖమ్మం నుంచి నుంచి కూడా ఇసుక పెద్దఎత్తునరవాణ జరగుతుంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా ఇసుక వ్యాపారులకు కోట్లు కుమ్మరిస్తుంది. ఇవే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇసుక వ్యాపారం సాగని ప్రాంతం లేదు. కాని ఎంత ఇసుక తరలి వెళ్తోంది. ఎంత ప్రభుత్వానికి రాయల్టీ వెళ్తోందనేది లెక్కలు తీస్తే అసలు నిజం బైట పడుతుంది. తెలంగాణలో జరిగే మొత్తం ఇసుక వ్యాపారాల మీద ఏక కాలంలో విజిలెన్స్ ఎంక్వౌరీలు వేసి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే అదికారుల నుంచి మొదలు, వ్యాపారుల దాకా తిన్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించొచ్చు. ఇక మరో కుంభకోణాలు అనేకం వెలుగులోకి వచ్చిన శాఖలో రిజిస్ట్రేషన్ శాఖలో బైట పట్టాయి. ఈ శాఖలో అవినీతి అనేది కింది స్ధాయి నుంచి పై స్దాయిదాకా వుంటుంది. ఇది అందిరికీ తెలిసిందే. అయినా చర్యలు తీసుకునేవారు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో బైట పడిన బాగోతాలు అన్నీ ఇన్ని కావు. ఏకంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల తయారీ వెలుగులోకి వచ్చింది. అది అప్పట్లో పెద్ద సంచనలమైంది. కాని ఏం జరిగింది. అదికారుల మీద చర్యలు తీసుకున్నది లేదు. ఇలా తెలంగాణలోని అనేక రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన అవినీతిపై అనేక విజిలెన్స్ ఎంక్వౌరీలు జరిగాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే? ఎక్కడైతే అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయో? అక్కడ విజిలెన్స్ ఎంక్వౌరీ చేసేది కూడా ఆరోపణలుఎదుర్కొంటున్న అదికారే కావడం విశేషం. ఇలాంటి ఎంక్వౌరీలు ఎక్కడైనా జరుతాయా? ఏ అధికారి మీద ఆరోపణలు వస్తే అదే అదికారి చేత ఎంక్వైరీ చేయించడం అంటేనే ఆ ఎంక్వౌరికీ ఎంత నిజాయితీ వుంటుందో,ఎంత పకడ్భందీగా సాగుతుందో అర్దం చేసుకోవచ్చు. ఇలా జరిగిన అనేక విజిలెన్స్ ఎంక్వౌరీలు బుట్టలకే చేరాయి. విచిత్రమేమిటంటే ఆరోపణలు ఎదుర్కొన్న అదికారే, తన కార్యాలయంలో విజిలెన్స్ ఎంక్వౌరీ చేపట్టడమనేంత గొప్ప విచారణ ప్రపంచంలో కూడా ఎక్కడా జరక్కపోయి వుండొచ్చు. ఇక వైద్య శాఖలో కూడా జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్ధితి. ముఖ్యంగా డిహెచ్గా పనిచేసిన గడల శ్రీనివాస్పై విజిలెన్స్ ఎంక్వౌరీ జరిగింది. పెద్దఎత్తున అవినీతి జరిగిందని తేలింది. కరోనాసమయంలో కేంద్రంనుంచి వచ్చిన నిధులను కూడా వదల్లేదని తేలింది. ఆఖరుకు ఆసుపత్రులకు వేసే సున్నాల సొమ్ముకూడా మింగిండన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. పైగా ఆయన ఉద్యోగంలో వుండగానే రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని చూశాడు. ప్రజా ప్రభుత్వం రాగానే వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొనివిదేశాలు చెక్కేశాడు. ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే తవ్వితే కొన్ని వందలు ఎంక్వౌరీలు బైట పడతాయి. ఒక ఉద్యోగిగా గడల ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తా, టికెట్ ఇస్తే అని ఓ రాజకీయ పార్టీతో బేరం కూడా అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, గత ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదు. ఆయన కూడా ఖమ్మం జిల్లా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కాని కుదలేదు. ఇలా ఈ శాఖలే కాదు, దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి, ఎంక్వౌరీలకు లెక్కలేదు. వాటికి మోక్షం జరిగింది లేదు. అధికారులకు శిక్ష పడిరదిలేదు. వ్యాపారుల నుంచి వసూలు చేసింది లేదు. అంతా మాయా…ఎంక్వౌరీ మరో పెద్ద మాయ.