లేబర్ ఆఫీసర్ ఉన్నట్టా లేనట్టా?
లేబర్ కార్డుల రెన్యువల్ కోసం ఎదురుచూపులు. .
కొత్త కార్డుల మంజూరు దేవుడేరుగు..
అర్హత ఉండి కార్డులు పొందలేకపోతున్న భవన నిర్మాణ కార్మికులు..
కార్డులు రెన్యువల్ లేక ప్రభుత్వ సహాయం నష్టపోతున్న బాధితులు..
నేటి ధాత్రి స్పెషల్ స్టోరీ..
రామాయంపేట జూన్ 13 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట లేబర్ కార్యాలయం కేవలం చూడడానికి మాత్రమే కనబడుతుంది..
లేబర్ ఆఫీసర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు కార్మికులకు గురవుతున్నారు.
కొందరు భవన నిర్మాణ కార్మికులతో పాటు లేబర్ కార్డులు ఉన్నవారు రెన్యువల్ కోసం కార్యాలయం చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు.
అలాగే కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు రోజుల తరబడి ఎదురుచూపులు చూస్తున్నారు.
కార్డుల మంజూరు కోసం దరఖాస్తులు చేసుకోవడంలో ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని చెప్పడానికి కూడా కార్యాలయం ఖాళీగా ఉంటుంది.
దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అత్యవసర సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుండి అందే సహాయం కూడా కార్మికులకు కాదని పరిస్థితి నెలకొంది.
గతంలో కొందరు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన వారికి నేటి వరకు ప్రభుత్వ సహాయం అందని పరిస్థితి దాపురించింది.
ఈ విషయంలో పూర్తిగా లేబర్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణమని కార్మికుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తూతూ మంత్రంగా వచ్చి ఒకటి రెండు గంటలు ఉండి వెళ్లిపోవడం పట్ల కార్మికులతో పాటు ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది.
కార్మిక సంఘం నాయకులు సైతం ఈ విషయంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిన వాటిని అమలు చేయడంలో స్థానిక లేబర్ ఆఫీసర్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది.
నిత్యం ప్రమాదకర పరిస్థితులు పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు అర్హత ఉన్న కార్డులు ఇవ్వకపోవడంతో పాటు రెన్యువల్ చేయకపోవడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అందుబాటులో ఉండాలి.
సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి..
లేబర్ కార్మికుల విషయంలో స్థానిక లేబర్ ఆఫీసర్ ఎప్పుడు అందుబాటులో ఉండటం లేదు.
దీంతో కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పాత వారితో పాటు కొత్త లేబర్ కార్డులు దరఖాస్తు చేసుకునే వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి మంచి పథకాలకు అర్హులైన కార్మికులు దూరమవుతున్నారు.
ఈ విషయంలో త్వరలోనే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనలు చేపడతాం.