చేపల ఉత్పత్తిని పెంచుతూ మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలి.
మత్స్యకారులకు తెప్పలు వలల పంపిణీ.
రాష్ట్ర పంచాయితి రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా నేటిధాత్రి:
జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచుతూ, మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని, రాష్ట్ర పంచాయితి
రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రం లోని గిరిజన భవన్ లో యు ఎస్ టి, నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో జీవంతరావుపల్లి గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన కుటుంబాలకు 25 తెప్పలు చేపలు పట్టే వలలు రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. , గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జీవంతరావుపల్లి గ్రామంలో అధికంగా ఉన్న మత్యకారులకు నిర్మాణ్ సంస్థ వారు తెప్పలు , వలలు అందించడం చాలా అభినందిందనీయం అని నిర్మాణ్ సంస్థ వారికి అభినందించారు.