సామజిక తనిఖీ పై గ్రామ సభ.

Secretary Bhagyalakshmi, Secretary Bhagyalakshmi,

సామజిక తనిఖీ పై గ్రామ సభ
• వివరాలు వెల్లడించిన బీఆర్పి అధికారులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024 – 2025 సంవత్సరాలకు గాను గ్రామాలకు వచ్చిన డబ్బులు, కూలీల పని దినాలను సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి గ్రామ సభ నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో శనివారం సామాజిక తనిఖీ బృందం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి 25 పనులకు గాను కూలీల వేతనాలు 24,88,950 రూ,, సామాగ్రికి 5,53,262 రూ,, కలిసి మొత్తంగా 30,42,212 రూపాయలు వచ్చినట్లు గ్రామసభలో వెల్లడించారు. అలాగే గ్రామంలో నూతన జాబ్ కార్డుల కోసం కొంతమంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఏఎన్ఎం గౌరీ, ఆశ వర్కర్ పుష్పులత, గ్రామస్తులు మ్యాదరి కనకరాజు, అందేస్వామి, బోయిని బాలరాజు, చాకలి రవీందర్, మంగలి అమరేందర్, బుర్రని మల్లేష్ గౌడ్, చాకలి రాములు, పిట్ల మల్లయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!