ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని మొగుడంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండలంలోని పలు వార్డులో స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇంటికి ముగ్గుపోసి,ప్రొసిడింగ్లు అందజేశారు.ప్రతి ఒక్కరికి ఇంటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ పథకం లక్ష్యం.అందుకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి మారుతి, హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ నిహారిక రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొంగల్ కిష్టన్న,ఆలూరు కిష్టన్న,విష్ణు,రాజు, ఖాన్ సాబ్, లాలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.