సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు.

Gram Sabha Gram Sabha

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు

నిజాంపేట నేటి ధాత్రి:

జాతీయ ఉపాధి హామీ పనుల పై సామజిక తనిఖీ అధికారులు సర్వే చేపట్టారు. ఈ మేరకు మండలం లోని నస్కల్ గ్రామంలో బీఆర్పి అధికారులు మూడు రోజులుగా గ్రామం లోనీ ఇంటి ఇంటికి వెళ్లి కూలీలు ఎంత పని చేశారు. ఎంత డబ్బులు పడ్డాయనే దానిపై సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి మాట్లాడారు.. 2024 – 25 సంవత్సరంలో 18 పనులు జరిగాయని ఈ పనులకు సంబంధించి కూలీ వేతనాలు, సామాగ్రి తో కలుపుకొని రూ,, 33,04,117 వచ్చినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో నూతన పని బుక్కులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ బృందం, గ్రామ కార్యదర్శి అరిఫ్ హుస్సేన్, దేశెట్టి సిద్ధ రాములు, సుధాకర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!