ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

TRS Party TRS Party

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఐనవోలులో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు

అయినవోలు నేటిదాత్రి:

ఐనవోలు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తక్కలపల్లి చందర్రావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం
బిఆర్ఎస్ పార్టీ మండల కన్వినర్ తంపుల మోహన్, బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా భరోసా అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ధనిక రాష్ట్రము మిగులు బడ్జెట్ అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు చేతగాని అడ్డగోలు హామీలు ఇచ్చి తాము అధికారం చేపట్టే సరికి రాష్ట్ర పరిపాలన చేతకాక రాష్ట్రం దివాలా తీసింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకాకపోతే, ప్రభుత్వం గద్దె దిగిపోవాలని కేసీఆర్ నాయకత్వంలో మరోమారు బంగారు తెలంగాణను సాధించేందుకు భారస పార్టీ సిద్ధంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారస గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, మండల నాయకులు కావటి స్వామి, కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుపెల్లి రాజు, పట్టపురం ఎల్లగౌడ్,బొక్కల స్వామి, గద్దల ప్రభాకర్,సంతోష్,రవి తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!