కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు.

Hunger Strike Hunger Strike

కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు

కోల్ బెల్ట్ ఏరియా పరిధిలో స్థానికంగా ఉన్న లారీలకు మాత్రమే లోడింగ్ ఇవ్వాలి

అసోసియేషన్ నిర్ణయించిన కిరాయి మాత్రమే చెల్లించాలి

ఇతర రాష్ట్రాల లారీలు తెప్పించి స్థానికంగా ఉన్న లారీ ఓనర్ల పొట్టగొడుతారా

నస్పూర్ (మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ తీగల్పాడు గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానుల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.ఇక్కడ స్థానికంగా ఉండే లారీ యజమానుల పొట్ట కొట్టడానికి సిసిఐ గోదాం వాళ్లు తమిళనాడు,కేరళ నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి ఇక్కడ లోడింగ్ చేపియడం వల్ల మా లారీ యజమానుల బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వందల మంది లారీ యజమానుల కుటుంబాలు లారీల మీద ఆధారపడి జీవిస్తున్నామని, మా లారీలు నడవనీయకపోతే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ వాళ్లు స్పందించి మా లారీలు లోడింగ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలరని పై అధికారులని వేడుకుంటున్నాము. ఈకార్యక్రమంలో కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండా సురేష్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల సుమన్, జనరల్ సెక్రెటరీ రాందేని రమేష్,జాయింట్ సెక్రటరీ అరికోళ్ల రమేష్,కల్చర్ సెక్రటరీ గుడికందుల తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి పవన్,క్యాషియర్ కటకం ప్రశాంత్ మరియు లారీ యజమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!