కులగణనతో ఓబీసీ పార్టీలకు ఇబ్బందులు తప్పవా?

ఆధిపత్య ధోరణి వీడకపోతే ఓబీసీ పార్టీల మనుగడ కష్టం
ఓబీసీల్లో ప్రయోజనం పొందుతున్నది కొన్ని కులాలే
అగ్రవర్ణాలకు మించిన స్థాయిలో కొనాగుతున్న ఆధిపత్యం
ఎదుగుదల లేని అణగారిన కులాలు
ఓబీసీ ఆధిపత్య కులాల మెడకు కులగణన
కులం పేరుతో రాజకీయాలు నడపడం కష్టం కావచ్చు
అల్పజనసంఖ్య కలిగిన కులాల మనుగడ కష్టం
సామాజిక సమతుల్యతను సమూలంగా మార్చేసే కులగణన
డెస్క్‌ ,నేటిధాత్రి: 
కాంగ్రెస్‌ సహా విపక్షాలు కులగణన చేపట్టాల్సిందేనని పట్టుపట్టడం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తిచేశాయి. ఇక జనతాదళ్‌ (యు) బిహార్‌లో దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన పూర్తిచేసింది. కులగణనలో సశాస్త్రీతను ప్రశ్నించినవారు లేకపోలేదు. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో ప్రాబల్యాన్ని కలిగివున్న కులాలు తమ ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో ఈ కులగణను వ్యతిరేకించడాన్ని కూడా మనం చూశాం. బీజేపీ మొదట్నుంచీ కులగణను వ్యతిరేకిస్తోంది. ఓట్లకోసం హిందువులను విభజించి ప బ్బం గడుపుకోవాలన్న దురాశతోనే విపక్షాలు కులగణనను డిమాండ్‌ చేస్తున్నాయంటూ వాదించినా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తదితర విపక్షాలు దీన్ని ప్రధానాస్త్రంగా ఉపయోగించడంతో తప్పనిపరిస్థితుల్లో కేంద్రం వచ్చే జనగణనతోపాటు కులగణన కూడా చేపడతామని ప్రకటించింది. విచిత్రమేమంటే విపక్షాలు దేన్నయితే తమ ప్రధాన అస్త్రంగా మలచుకోవాలనుకుంటున్నాయో అది బూమరాంగ్‌ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రా ల్లో బలీయంగా వున్న కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఈ కులగణన ఫలితాలు ఇబ్బంది కలిగించేవి గా వున్నాయనేది ఇప్పుడిప్పుడే వెల్లడవుతుండటం తాజా పరిణామం. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌ (యునైటెట్‌) పార్టీల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓబీసీ కులాలకు చెందిన నాయకులకు కొత్త సమస్యలు పుట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడిరది. అదెట్లాగో పరిశీలి ద్దాం.
మింగుడుపడని సమస్య
ఎస్సీ వర్గాలను ఉపకులాలుగా వర్గీకరించమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ఆవర్గాల్లో సమస్యాత్మకంగా మారినట్టే, ఇప్పుడు కులగణన ఓబీసీ (ఇతర వెనుకబడిన కులా లు) రాజకీయాలపై ఆధారపడిన పార్టీలకు మింగుడు పడటంలేదు. పైకి కులగణన వల్ల అధిక జనాభా కలిగిన ఓబీసీ కులాలవారికి ప్రయోజనం కలుగుతుందని పైకి ఎంతగా విపక్షాలు వా  దించినా, ఓబీసీల్లోని కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యం వహిస్తున్న సంగతి ఇప్పుడు మరింత   ప్రస్ఫుటం కానుంది. అంటే ఓబీసీకులాల్లోనే అసమానతలు బహిర్గతమవుతున్నాయి. రాజ్యాం  గం ప్రసాదిస్తున్న రిజర్వేషన్ల ఫలాలను కూడా వీటిల్లోని కొన్ని కులాలుమాత్రమే అనుభవించడమేకాకుండా మరోపక్క రాజకీయ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో  కొన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వైనం కులగణన పుణ్యమాని మరింత స్పష్టంగా వెల్లడి కానుంది. ఇప్పటివరకు ఓబీసీ భజన చేస్తున్న విపక్షాలకు ఇదొక విరోధాభాస వంటిదేనని చెప్పాలి. 
కొన్ని కులాలదే ఆధిపత్యం
1931లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం దేశంలో కులగణన నిర్వహించిన తర్వాత, మళ్లీ దాన్ని చేపట్టడం ఇదే ప్రథమం. కేంద్రం నిర్ణయాన్ని ఎస్‌.పి, ఆర్‌జేడీ, జెడీ(యు), కాంగ్రెస్‌ పార్టీలు స్వాగతిం చాయి. కేంద్రం నిర్ణయం తీసుకోవడం తన ఘనతేనని జేడీ(యు) చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. కాకపోతే ఇప్పుడు ఎస్‌.పి, ఆర్‌జేడీలు కూడా ఈ అంశాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం తాజా పరిణామం. ఈ మూడు పార్టీలు జయ ప్రకాష్‌ నారాయణ్‌ యుగం, మండల్‌ కమిషన్‌ కాలం తర్వాత వెలుగులోకి వచ్చినవే. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ఓబీసీలకు చెందిన కొన్ని కులాల నాయకులు మాత్రమే! ఓబీసీల ఐక్యతారాగం వెనుక ఆయా కులాల ‘సామాజిక`ఆర్థిక వెనుకబాటు’ అనే ని నాదం ప్రధాన పాత్ర పోషించిందనేది కీలక సత్యం. ఇందులో భాగంగానే ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి, ములాయంసింగ్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ`క్షత్రియ ఆధిపత్యాన్ని దెబ్బతీసి ఓబీసీల పాలనను అందుబాటులోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇక లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ‘ఓబీసీ’ కులంకార్డుతో రాజకీ  యాలు నడిపి ఆర్‌జేడీ పాలనను తీసుకొచ్చారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అణగదొక్కామని ప్రచారం చేసుకున్న లాలూప్రసాద్‌ యాదవ్‌, వారిని తలదన్నే రీతిలో తన కుటుంబ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, ఓబీసీల్లో ఎవరినీ పైకి రానీయకుండా అప్రతిహతంగా బిహార్‌ను పాలించారు. ఇక నితీష్‌ కుమార్‌ విషయానికి వస్తే, ఆయన పై ఇద్దరు నాయకులంత దూకుడుగా కాకుండా, మధ్యేమా ర్గంలో తన ఓబీసీ రాజకీయాన్ని కొనసాగించారు.బిహార్‌ రాజకీయాల్లో యాదవుల (ఓబీసీలు) వెన్నుదన్నుతోనే ఆర్‌జేడీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో వీరి జనాభా     14% కావడం ఇక్కడ కీలకం. 
ఇక ఉత్తరప్రదేశ్‌ విషయానికి వస్తే యాదవుల జనాభా 8 నుంచి 10శాతం వరకు వుంటుంది. సమాజ్‌వాదీ పార్టీ ఓబీసీల్లోని ఇతర ఉపకులాలు, ముస్లింల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో నితిష్‌కుమార్‌ ప్రధానంగా కూర్మీలు (ఇది ఆయన కులం) మరియు కోయిర్లపై ఆధారపడి తన రాజకీయాన్ని నడిపారు. ఈ రెండుకులాలు కలిపితే 7 నుంచి 10శాతం వరకు వుంటారు. అయితే తీవ్రంగా వెనుకబడిన కులాల్లో (ఈబీసీ) ఆయన గట్టి పట్టును సంపాదించడం కూడా జేడీయూ అధికారంలోకి రావడానికి మరో కారణం. ఎందుకంటే ఈబీసీల జనాభా రాష్ట్రంలో36% వరకు వుంది. 
ఇక ఓబీసీ పల్లవి కష్టం
ఈవిధంగా ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌కుమార్‌లు ఓబీసీ రాజకీ యాల నేపథ్యంలో ఎదిగినా, చివరకు ఈ వర్గాల్లో కేవలం ఒక్క కులం మాత్రమే ఆధితపత్యం వహించడం చివరకు చోటుచేసుకున్న పరిణామం. ఇప్పుడు చేపట్టిన కులగణన వల్ల, ఓబీసీల్లో ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారన్న నిజం బయటకు రావడం ఈ నాయకులకు మింగుడుపడటం లేదు. అంటే ఓబీసీల్లో ఎన్నో కులాలున్నప్పటికీ కేవలం ఒకే ఒక కులం అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో ఆధిపత్యం వహిస్తున్నదన్న సత్యం బహిర్గతం కావడంతో ఇప్పుడు ఆయా నాయకులకు ఓబీసీ పల్లవిని అందుకోవడం కష్టంగా మారింది. అంతా ఓబీసీలే అనేది ఒక సత్యమైతే, వీరిలో ఒక కులం మాత్రమే ఆధిపత్యం వహిస్తున్నదనేది మరో సత్యం. ఈవిధంగా కులగణనలో ఓబీసీ అనేది ఒక విరోధాభాసగా తయారైంది! దేశ జనాబాలో ఓబీసీలదే సింహభాగమని పై మూడు రాజకీయ పార్టీల వాదన. అందుకనే కులగణ చేపడితే ఓబీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీ యపరంగా న్యాయం జరుగుతుందని వీరు చేస్తున్న వాదన కూడా సహేతుకమే. అయితే ఉద్యోగ, ఉపాధి, రిజర్వేషన్‌ ప్రయోజనాలు, రాజకీయ ఆధిపత్యం ఓబీసీల్లో ఏదో ఒక కులం చేతిలోనే వున్నదనేది ఈ కులగణనద్వారా స్పష్టమవుతోంది. అంటే ఎస్సీ రిజర్వేషన్లలో మాలలు ప్రయోజ నం పొందినట్లుగానే, ఓబీసీల్లో యాదవుల వంటి కొన్ని కులాలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయని చెప్పవచ్చు. 
‘యాదవీకరణ’
ఓబీసీ రాగం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌లు ఓబీసీల్లోని ‘యాదవ’ కులానికి చెందినవారు. ఎప్పుడైతే సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌లు అధికారంలోకి వచ్చాయో అప్పుడు ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాల్లో కేవలం ఈ కులానికి చెందినవారే ఎక్కువగా ప్రయోజనం పొందడం మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పూర్తిగా ‘యాదవీకరణ’ జరిగిందనేది ప్రధానంగా వచ్చిన ఆ రోపణ. ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు యు.పి.లోని 1526 పోలీస్‌ స్టేషన్లలో,    600 యాదవ్‌ కులానికి చెందిన పోలీసు అధికార్ల ఆధిపత్యంలో వుండేవని ఒక నివేదిక వెల్లడిరచింది. లక్నో, మధుర, కాన్పూర్‌, ఘజియాబాద్‌, సంభాల్‌, బడౌన్‌ వంటి నగరాల్లోని పోలీస్‌ స్టేషన్లలో 40శాతం వరకు యాదవుల ఆధిపత్యంలోనే వుండేవి. సీనియర్‌ అధికార్ల అంచనా ప్రకారం 50శాతం పోస్ట్‌లను అనధికారికంగా యాదవ్‌లకు రిజర్వ్‌ చేసి వుంచేవారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. కేవలం ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడే ఇట్లా జరిగిందా అంటే, బీఎస్‌పీ అధికారంలో వున్న 2011వ సంవత్సరంలో కూడా ఇదే తంతు  కొనసాగడం విశేషం. బీఎస్‌పీ కాలంలో ప్రావెన్షియల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (పీసీఎస్‌) పరీక్షా ఫలితాల్లో 176 మంది ఓబీసీలు ఉత్తీర్ణులైతే వీరిలో 147మంది యాదవులు! దీంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగడంతో ప్రభుత్వం మరో 86మంది అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 54 మంది మళ్లీ యాదవులే వుండటం గమనార్హం! ఈ 54 మందిలో చివరకు   ఇంటర్వ్యూలో 50 మంది ఎంపికయ్యారు. 2011 నుంచి 2014 వరకు వివిధ రకాల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎక్కువ మంది యాదవ కులానికి చెందిన అభ్యర్థులే ఎంపికవడం గమ నార్హం. తర్వాతి కాలంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 8 నుంచి 14 టిక్కెట్ల ను యాదవులకే కేటాయించింది. 2024లో అఖిలేష్‌ యాదవ్‌ తమ కులానికి కేవలం నాలుగు టిక్కెట్లు మాత్రమే ఇచ్చారు. ఆ నలుగురూ కూడా ఆయన కుటుంబసభ్యులే! నెల క్రితం వరకు యు.పి.లోని 22 జిల్లాల్లో పార్టీ ఆధిపత్యం యాదవుల చేతుల్లోనే కొనసాగింది.
బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ
ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఐదేళ్లపాటు బిహార్‌ను పాలించారు. ఆయన పాలన దేశంలోనే గొప్ప అవినీతి, అరాచకాలకు బ్రాండ్‌గా మారిపోయింది. వివిధ శాఖలకు చెందిన అధికార్లు వేధింపుల భయంతో బదిలీలు చేయించుకున్నారు. కొద్దో గొప్పో సంపద కూడబెట్టుకున్న వారు దాన్ని బయటపెట్టడానికి భయపడ్డారు. భద్రతకోసం మహిళలు, పురుషులపై మరింతగా ఆధారపడాల్సి వచ్చింది. ఓబీసీ కులాల్లో పేదలు మరింత పేదలుగా మారగా, ధనికులు మరింతధనికులయ్యారు. లాలూ కాలంలో భూమి లావాదేవీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలైన వాటి ల్లో ఎక్కువ ప్రయోజనం పొందింది యాదవులే. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సురేంద్రయాదవ్‌, సాధుయాదవ్‌, సుభాష్‌ యాదవ్‌ వంటివారు రాష్ట్ర యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఏకఛ  త్రాధిపత్యంగా అధికారాన్ని చెలాయించారు. బిహార్‌లో 2023లో నిర్వహించిన కులగణన ప్రకారం, ప్రభుత్వ సర్వీసుల్లో 6,21,4811 మంది ఓబీసీలుండగా వీరిలో 2,89,538 (46.59%) మంది యాదవులే! ఆవిధంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓబీసీల్లో యాదవులను ఎంతగా పైకి తీసుకొచ్చారో మిగిలినవారిని అంతగా నిర్లక్ష్యం చేశారు. ఉదాహరణకు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం టిక్కెట్లను కేవలం యాదవులకే ఇచ్చిన ఘనత లాలూది. 2023లో 15 జిల్లాల్లో పార్టీకి నాయకత్వం వహించింది యాదవులే! లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కులపిచ్చి ఎంతగా ముదిరిపో యిందంటే ఆఖరుకు ముస్లింలు ఆధిపత్యం వహించే స్థానాల్లో కూడా యాదవులకే టిక్కెట్లు ఇచ్చేస్థాయికి చేరుకుంది. 
కూర్మీ కోయిర్లు మరియు లవ్‌కుశ్‌ ఐకమత్యం
నితిష్‌కుమార్‌ కూర్మీ`కోయిర్‌ కులాలను ఒకే విధంగా చూస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమతు ల్యాభివృద్ధి వుండాలనేది ఆయన అభిమతం. అందుకనుగుణంగానే ఆయన విధానాలు కొనసా గుతాయి. ఉపేంద్ర కుశావహ, శకుని చౌదరి (బిహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి తండ్రి) నితిష్‌కు గట్టి మద్దతుదార్లుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కూర్మీ`కోయిరీ సంయోజనను లవ్‌`కుశ్‌గా రాష్ట్ర ప్రజలు పరిగణిస్తారు. భూకమతాలను కలిగివుండి వ్యవసాయంపై ఆధారపడే ఈ వర్గాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలను నితిష్‌ ప్రభుత్వం క ల్పించింది. ప్రస్తుతం బిహార్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్‌లో 46.6% యాదవులే వున్నారు. అదే లవ్‌`కుశ్‌వర్గం ఓబీసీ రిజర్వేషన్లలో 36.9% కొనసాగుతున్నారు. మరి రాష్ట్ర జనా భాలో యాదవులు 14.27% కాగా కోయిరీ`కూర్మీ ప్రజలు 7.09%. ఇప్పుడు మొత్తం ఉద్యోగాల్లో కోయిరీ`కూర్మీ ప్రజలు కేవలం 2.47పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. అంటే ఇక్కడ జనాభా సంఖ్యకు, పొందుతున్న ఉద్యోగాలకు పొంతన వుండటంలేదనే అర్థం! ఎందుకంటే ప్రభుత్వ ఉ ద్యోగాల్లో యాదవుల ప్రాతినిధ్యం 1.55గా వుంది మరి!!
ఇతర రాష్ట్రాల్లో కూడా
ఈవిధంగా జనాభా సంఖ్యకు, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యానికి పొంతనలేకపోవడం కేవలం బిహార్‌కు మాత్రమే పరిమితం కాదు. జార్కండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అంటే ఓబీసీ వర్గాల్లోని ఆధిపత్య కులాలు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతుండగా, మిగిలినవారికి అవి అందుబాటులో లేవు. ఆర్‌జేడీ, ఎస్‌.పి., జెడీ(యు) వంటి ప్రాంతీయ పార్టీలు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తొలగించి వెనుకబడిన తరగతులకు అధికారాన్ని కట్టబెట్టాయని కొందరు ప్రచారం చేస్తున్నప్పటికీ, వెనుకబడిన కులాల్లో అట్టడుగున వున్న కులాల స్థితిగతుల్లో ఏవిధమైన మార్పు లేదన్నది అక్షరసత్యం. అందువల్ల కులగణన అనేది కేవలం  సంఖ్యకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక, ఆర్థికాభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీనివల్ల ఓబీసీ వర్గాల్లోని కొన్ని కులాలు అగ్రవర్ణాలను మించిన స్థాయిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అన్ని రంగాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. జనాభాపరంగా తక్కువగా వున్న కులాలు, తమ అస్తిత్వంకోసం ఒక ఆధిపత్య కులానికి మద్దతు పలకాల్సి వస్తుండటంకూడా గమనించాలి. ఇప్పుడు బిహార్‌లో తేజస్వీ యాదవ్‌ను చాలామంది యాదవులు అనుమాన దృక్కులతో చూస్తున్నారు. కుశావహలకు అనుకూలంగా ఆయన మెలగడమే కారణం. జార్ఖండ్‌ లో గత ఎన్నికల్లో సురేష్‌ మెహతో నేతృత్వంలో ఆల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పార్టీ (ఏజేఎస్‌యూపీ) ఏర్పాటైంది. సురేష్‌ మెహతోను తరచుగా కూర్మీ మెహతోగా పిలిచేవారు. అయితే 2024 అ సెంబ్లీ ఎన్నికల్లో జైరామ్‌ మెహతో నాయకత్వంలోని జార్ఖండ్‌ లోక్‌తాంత్రిక్‌ క్రాంతికారి మోర్చా కూర్మీల్లో ఎక్కువ మద్దతును సాధించింది. అంటే కూర్మీలు జైరామ్‌ మెహతా పార్టీపైనే విశ్వాసం వుంచారు.ఏతావాతా చెప్పొచ్చేదేమంటే కులగణన ఓబీసీ పార్టీల్లో కొనసాగుతున్న సమతుల్యతను దెబ్బతీయవచ్చు. తమకు సంద్రాయంగా విధేయులుగా వున్న వర్గాల్లో తమ బలాన్ని నిలుపుకుంటూనే, త మను తాము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటే తప్ప ఓబీసీ పార్టీల మనుగ డ కష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!