జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల వైసీపీ శ్రేణులుకు మరో షాక్.

Ranks Ranks

జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల వైసీపీ శ్రేణులుకు మరో షాక్…

తిరుపతి(నేటి ధాత్రి) మే 27:

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు సంబంధించి ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు 100 మంది మహిళ కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇంచార్జ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇంచార్జ్ పొన్నా యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో వందమందితో భారీగా పార్టీలోకి చేరారు. గతంలో కూడా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరి అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు.మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వందమంది ఆధార, అభిమానాలు పొందిన నల్లాని నిర్మల కి పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి మరియు జనసైనికులు నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!