హైవే విస్తరణ బాధితులకు పరిహారం కోసం.!

Lakshma Reddy's. Lakshma Reddy's.

హైవే విస్తరణ బాధితులకు పరిహారం కోసం కృషి చేస్తా

భూములు, ప్లాట్లపై ఉన్న శ్రద్ధ లక్ష్మారెడ్డికి నియోజకవర్గ అభివృద్ధిపై లేదు

జడ్చర్ల /నేటి ధాత్రి.

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

 

 

167వ నెంబరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జడ్చర్ల పట్టణ పరిధిలో నిర్మాణాల తొలగింపుతో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించడానికి ప్రయత్నిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. దీని కోసం బాధితులందరూ తమ దరఖాస్తులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవ్వాలని కోరారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన పార్టీ నేతల ఇళ్లను కాపాడుకోవడానికి హైవే అలైన్ మెంట్ మార్చారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల్లోని హైవే బాధితులకు పరిహారం ఇచ్చిన కేంద్రం, జడ్చర్లకు మాత్రం పరిహారం ఇవ్వకపోయినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు.
జడ్చర్ల పట్టణంలోని 20వ, 2వ వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా అనిరుధ్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి మొదలుకొని కల్వకుర్తి రోడ్డులోని జడ్చర్ల వంద పడకల ఆస్పత్రి వరకూ ఉన్న ఇళ్లు, భవనాలను తొలగించడం జరిగిందని, అయితే ఇతర ప్రాంతాల్లో ఇళ్లు కొట్టేసినప్పుడు నష్టపరిహారం ఇచ్చారని, కానీ జడ్చర్ల పట్టణంలో మాత్రం పరిహారం ఇవ్వకపోయినా గతంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దీని కోసం కనీసం ఒక లేఖ అయినా ఇచ్చారా.. అని నిలదీశారు. ఈ విషయం గురించి తాను ఎన్నికలకు ముందు కూడా మాట్లాడానని గుర్తు చేశారు. ప్రస్తుతం జాతీయ రహదారుల విభాగం అధికారులతో ఈ విషయం గురించి తాను మాట్లాడానని, జడ్చర్ల పట్టణంలో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసానని తెలిపారు. గతంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన కార్యకర్తకు సంబంధించిన ఇల్లు కొట్టాల్సి వస్తుందని నేషనల్ హైవే డిజైన్ మార్చారని, ఈ కారణంగానే రోడ్డుకు ఒక వైపు ఎక్కువగా కొట్టేసి, మరోవైపు తక్కువగా కొట్టారని ఇదెక్కడి న్యాయమన్నారు. ఇప్పుడు అఖిల పక్షం సమావేశం పెట్టుకున్నప్పుడు గతంలో ఎవరి ఇళ్లు పోకూడదని హైవే అలైన్ మెంట్ మార్చారో గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని అనిరుధ్ రెడ్డి హితవు పలికారు. ఈ అలైన్ మెంట్ మార్చినప్పుడు లక్ష్మారెడ్డి ఏం ఆలోచించారని, ఈ విషయంగా అసలు ఆయనకు అవగాహన ఉందా? అని విమర్శించారు. ప్రభుత్వ భూములకు, దేవుని భూములకు ఎన్వోసీలు తెచ్చుకోవాలి, ప్లాటింగ్ చేసి ఎలా అమ్ముకోవాలనే ఆలోచన తప్ప నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా మాజీ ఎమ్మెల్యేకు లేదని దుయ్యబట్టారు. ఈ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించడానికి తాను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దీని కోసం రహదారి విస్తరణలో నష్టపోయిన జడ్చర్ల పట్టణ వాసులు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను తన క్యాంపు కార్యాలయంలో అందించాలని కోరారు. ఈ విషయాన్ని తాను కేంద్ర జాతీయ రహదారుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులందరికీ పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!