సైబర్ నేరస్థుల ఉచ్చులో పడవద్దు.

Trap Trap

సైబర్ నేరస్థుల ఉచ్చులో పడవద్దు

సి.ఐ రాజ్ కుమార్ గౌడ్

మరిపెడ నేటిధాత్రి:

మరిపెడ మండల కేంద్రములో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదురోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సైబర్ క్రైమ్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారిణి గాదె అనితా దేవి అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ యస్.రాజ్ కుమార్ గౌడ్ హాజరై ఉపాధ్యాయులు ఎవరు కూడా సైబర్ నేరస్థుల ఉచ్చులోపడొద్దని అన్నారు.సైబర్ నేరస్థుల వలలో చిక్కుకొని డబ్బులు నష్టపోవద్దని, ఆన్లైన్ బెట్టింగ్ లతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అన్నారు.మార్కేట్లలో విరివిగా వాడుతున్న సోషల్ మీడియా లో పై అవగాహన కల్పించారు.యాప్ లను అవసరం మేరకే వాడాలని దుర్వినియోగం చేయొద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సంతోష్ కుమార్,అంజమ్మ,రిసోర్స్ పర్సన్స్ లింగాల మహేష్ గౌడ్, దోమల లింగయ్య,యాదగిరి,వెంకన్న,శ్రీను,మంగూ,మంగీలాల్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!