కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి.

MPDO inspects teacher MPDO inspects teacher

కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి

ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఎంపిడిఓ

పరకాల నేటిధాత్రి

 

 

మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన చైతన్య మోడల్ స్కూల్ లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు సందర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ “మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాలు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని,ఆధునిక విద్యా విధానాలను పాటిస్తూ విద్యార్థులకు భోదించాలని అన్నారు.ప్రభుత్వం ఉచిత పుస్తకాలు,దుస్తులు, రుచికరమైన మధ్యాహ్న భోజనం,నోటు బుక్స్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలను విద్యార్థులకు కల్పిస్తుందని ఉపాధ్యాయులు ఈ విషయాలు ప్రచారం చేసి పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు విధ్యాభోదనలో నూతన మెలకువల పై స్టేట్ రిసోర్స్ పర్సన్ శ్రీధర్,యం.ఆర్.పి లు బిక్షపతి,రామన్న,మోహన్, ఆజాం,బాబు,లత,కీరవాణి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!