కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం.

shops shops

కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం…

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

కిరాణా షాపుల్లో వస్తువుల చివరి తేదీ చూసుకొని కొనుక్కోండి…

కాంగ్రెస్ నాయకులు గోపతి భానేష్

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ ఏరియాలో కిరాణా దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పడిన నేపథ్యంలో కిరణా షాప్ యజమానులు కాలం చెల్లిన వస్తువులను, గడువు ముగిసిన తినుబండారాలను విక్రయిస్తున్నారని అమ్మ గార్డెన్ ఏరియా కాంగ్రెస్ నాయకులు గోపతి బానేష్ మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ స్పందించి శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్, సంతోష్ లను గద్దె రాగడి ఏరియాలోని కిరాణా దుకాణాలకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించారు.33 వ రోడ్ నంబర్ షాపుల్లో తనిఖీలు చేస్తుండగా కనకదుర్గ కిరాణా షాప్ లో కాలం చెల్లిన వస్తువులు.

 shops
shops

బ్రెడ్ లాంటి తినుబండారాలు విక్రయిస్తున్నారని నిర్ధారించుకొని అట్టి కిరణా షాప్ ను సీజ్ చేశారు. కాలం చెల్లిన వస్తువులను, తినుబండారాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని, అధిక ధరలకు అమ్మితే షాప్ లైసెన్స్ రద్దు చేసి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పరిధిలోని దుకాణాల యజమానులు మున్సిపాలిటీ టాక్స్, లైసెన్స్, ఫుడ్ సెక్యూరిటీ లైసెన్స్ లు తప్పనిసరిగా తీసుకోవాలని, లైసెన్సు లు లేకుంటే షాపులను సీజ్ చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!