మార్కెట్ల చట్ట సవరణ ముసాయిదా తిరస్కరించండి.

Farmers Crops. Farmers Crops.

మార్కెట్ల చట్ట సవరణ ముసాయిదా తిరస్కరించండి.

తొర్రూర్ (డివిజన్) నేటిదాత్రి

 

 

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవసాయ మార్కెట్ల చట్ట సవరణ ముసాయిదాను భారత రైతాంగం తిరస్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. డివిజన్ కేంద్రమైన తొర్రూర్ లో సోమవారం రోజున సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) కరపత్రం సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు తన పండించిన పంటకు చట్టం తేవడంలో నరేంద్ర మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైతు తన పండించిన పంటలకు మార్కెట్లో అమ్ముకోవడానికి ఉన్న వ్యవస్థను మార్చి అదానీ,అంబానీ లాంటి కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ధర నిర్ణయంలో గాని, తూకాలలో జరిగే అక్రమాలను గాని, పండించిన పంటకు డబ్బులు కొనుగోలుదారు ఇవ్వకుంటే అడిగే హక్కు లేకుండా చట్ట సవరణ ముసాయిదా ఉందని ఆరోపించారు. ఇప్పటికే పుటేడు కష్టాలలో దినదిన గండంగా బతుకుతున్న రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడుతూ అక్కడ రైతులకు నిలువ దోపిడి తప్పదా అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి ఈనెల 20న నిరసన ప్రదర్శనలు, జూన్ 9న గ్రామీణ భారత్ బంద్ లు జయప్రదం చేయాలని వీరన్న పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంల్ మాల్ మాస్ లాంటి డివిజన్ నాయకులు ఊడుగుల రాములు జక్కుల యాకయ్య గద్దల వెంకటయ్య గజ్జి యాకయ్య కేశవులు తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!