జువ్వెంతుల లక్ష్మారెడ్డి కుటుంబనికి
సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం పరామర్శ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘము సంయుక్త కార్యదర్శి బోయినపల్లి మండలం మర్లపేట గ్రామానికి చెందిన జువ్వెంతుల లక్ష్మారెడ్డి ఈరోజు గుండెపోటుతో మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి జిల్లా రెడ్డి సంఘము తరపున దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరితో పాటుగా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, కోశాధికారి ఏడమల హనుమంత రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీపి రెడ్డి కిషన్ రెడ్డి రామన్నపేట మాజీ సర్పంచ్ కమటం అంజిరెడ్డి,రెడ్డి సంఘం జిల్లా నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏమి రెడ్డి సురేందర్ రెడ్డి గ్రామ రెడ్డి సంఘం సభ్యులు పాల్గొని సానుభూతి వ్యక్తం చేశారు.