వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్.
నాగర్ కర్నూల్ నేటి దాత్రి:
నాగర్ కర్నూలు జిల్లా ఆమనగల్ మార్కెట్ శనివారం నాడు కమిటీ వైస్ ఛైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి ఆకస్మిక పర్యటన సందర్భంగా ఆమనగల్ PACS ఆధ్వర్యం లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం సేకరణ వివరాలను సంబధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డు లో నిర్మినా దశలో ఆగిపోయిన పనులను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని పరిశీలించారు.కూరగాయల మార్కెట్ .మాటెన్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సమస్యను MLA గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రజలకు కూడా అన్ని సదుపాయాలు ఒకే దగ్గర ఉంటాయని వైస్ చైర్మన్ వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ తాళ్ల రవీందర్ ,నరేష్ నాయక్ , సంపత్ కుమార్ ఉన్నారు.