భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన.

Bhu Bharati Bhu Bharati

— భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన
• జూన్ 2 నుండి భూ భారతి దరఖాస్తుల స్వీకారణ
• అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి

మెదక్ ఆర్డీఓ రమాదేవి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన భూ భారతి పై రెవెన్యూ సిబ్బందికి మెదక్ ఆర్డీఓ రమాదేవి అవగాహన కల్పించారు. ఈ మేరకు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్నీ ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.. మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 2 న భూ భారతికి సంబంధించి దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు. భూమిలకు సంబంధించిన సమస్యల పై సంబంధిత ధ్రువ పత్రాలను జోడించి దరఖాస్తు ఫామ్ తో కలిపి అధికారులకు అందివాలన్నారు. భూ భారతి లో దరఖాస్తు చేసుకున్న సమస్యలను విచారించి పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సత్వర సమస్యల పరిష్కారం కోసం భూ భారతి నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యడం జరిగిందన్నారు. అలాగే అకాల వర్షాల దృశ్య కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అరబోసిన రైతులు టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వేగవంతగా కొనుగోలు జరపాలని ఇంచార్జులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యుటీ తహసీల్దార్ రమ్యశ్రీ,సీనియర్ అసిస్టెంట్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు ప్రీతీ, ఇమాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!