నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేసిన వైద్యాధికారులు
నిజాంపేట, నేటి ధాత్రి :
మెదక్ జిల్లా నిజాంపేట
మండల కేంద్రంలోని శ్రీనివాస నర్సింగ్ హోమ్ ను జిల్లా వైద్యాధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ సుజన మాట్లాడుతూ నిజాంపేట శ్రీనివాస నర్సింగ్ హోమ్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు తనికి చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే అన్ని రిపోర్టులను సేకరించి డిఎంహెచ్వో కు పంపించడం జరుగుతుందని తదుపరి విచారణ చేపట్టిన తర్వాత తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ అనిల్, డాక్టర్ హరిప్రియ, డెమో శ్రీనివాస్, సూపర్వైజర్లు వెంకటేశ్వరరావు, కొండయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.