చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ .

Forest fires. Forest fires.

ప్రజల్లో చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ

అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ప్రజల్లో చైతన్యం,అవగాహన ద్వారానే అడవులు, ప్లాంటేషన్లలో అగ్ని ప్రమాదాల నివారణ పూర్తిగా సాధ్యమవుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జైపూర్ మండలంలోని ముదిగుంట శివారులో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వేసవిలో ప్లాంటేషన్ లలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మంటలు ఎలా ఆర్పాలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Forest fires
Forest fires

సంస్థ పరంగా బ్లోయర్ లతో మంటలు ఎలా నియంత్రిస్తారో వివరించడం జరిగింది. ప్లాంటేషన్లు,అటవీ ప్రాంతాల మీదుగా వెళ్లేవారు బీడీలు సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దని చెప్పారు. అడవులు,ప్లాంటేషన్లు కాలడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు.వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తో పాటు కాగజ్ నగర్,బెల్లంపల్లి రేంజ్ ల ప్లాంటేషన్ మేనేజర్లు లక్ష్మణ్, సునీత,ఫీల్డ్ సూపర్వైజర్లు రాజేష్,శ్రీనివాస్,వాచర్లు, సిబ్బంది శంకర్,సాయికిరణ్, లచ్చన్న,రాకేష్,ఓదెలు, సంజీవ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!