కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి.
అదనపు వసూళ్లపై నిశ్శబ్దం వెనుక రహస్యం.
అదునపు బకెట్లు అనుమతి ఇస్తేనే క్వారీలు ప్రారంభిస్తాం.
నెలల నుండి డంపింగ్ చేసి ఉన్న లోడింగ్ కు సమీరా అంటున్న కాంట్రాక్టర్ లు.
గత నెల రీచులన్నీ ఆన్లైన్ చేసిన, పట్టించుకోని కాంట్రాక్టర్.
ప్రస్తుతం కొనసాగిస్తున్న ఇసుక రీచ్ లో ఎన్ని అక్రమాలు జరిగిన డోంట్ కేర్.
లోడింగ్ చేయనున్న కాంట్రాక్టర్ పై చర్యలకు బదులు, టీజీఎండిసి తమాషాగా చూస్తుంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ కు టీజీఎండిసి తూట్లు పొడుస్తుంది.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ఇసుక అక్రమాలు ఇసుక క్వారీల నిర్వహణ విషయంలో టి జి ఎం డి సి అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచాల్సింది పోయి, కాంట్రాక్టర్లకు వారు చెప్పిందే వేదం అంటూ సై అంటున్నారు. మండలంలో ఇసుక క్వారీల నిర్వహణ, విషయంలో టి జి ఎం డి సి, అధికారులు, నూతన ఇసుక పాలసీని అమలు పరిచాల్సింది పోయి, పాలసీ యొక్క విధానాలను తూట్లు పొడుస్తున్నారు, ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లకు, ప్రత్యక్షంగా కాంట్రాక్టర్లకు సహకరిస్తూ కాంట్రాక్టర్ల సూపర్వైజర్లతో సమానంగా టీజీఎండిసి సిబ్బంది, వసూళ్లు చేసి ఇవ్వడం, శరమాములుగా కొనసాగుతుంది. మరోవైపు దర్జాగా కాంట్రాక్టర్ సిబ్బంది ప్రతి లారీ వద్ద సీరియల్ నంబర్ పాసింగ్ లోడింగ్ లాంటి పేర్లతో వేల రూపాయలను దండుకోవడం జరుగుతుంటే, అధికారులు తమకేమీ తెలువది అనే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఇసుక రీచుల ప్రారంభం విషయంలో, టీజీఎండిసి అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి, కాంట్రాక్టర్ల వెసులుబాటు అక్రమ సంపాదనకు మొగ్గు చూపుతూ వారు చెప్పింది వేదం అంటూ కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి అధికారులు, కొత్త రీచుల ప్రారంభం ఇసుక రీచుల్లో ఇసుక డంపింగ్ చేసి ఉన్నప్పటికీ లోడింగ్ కై ఆదేశాలు జారీ చేసే సత్తా లేకుండా పోయింది. దీనికి సాక్షాలు మండలంలో అనేక ఇసుక రీచుల్లో డంపింగ్ చేసి ఉన్న ఇసుక కుప్పలు సాక్ష్యం.

కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి.
ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్న టీజీఎండిసి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి, ఇసుక కాంట్రాక్టర్ల గుప్పిట్లో కీలుబొమ్మలా మారి, అక్రమ వసూళ్ల వ్యవహారం పై నిశ్శబ్దాన్ని పాటిస్తూ, కొత్త ఇసుక రీచుల ప్రారంభం విషయంలో, కాంట్రాక్టర్లకు వెసులుబాటు అక్రమ వసూళ్లు అదనపు బకెట్ల వ్యవహారం ప్రారంభం కై ,టి జి ఎం డి సి, పై ఒత్తిళ్లు, చీకటి ఒప్పందాలకు వేచి చూస్తూ, ప్రస్తుత అదనపు వసూళ్ల వ్యవహారంతో ఇసుక కాంట్రాక్టర్లకు, కడుపు నిందడం లేదని, అదునపు బకెట్లు 2500 నుండి 5000 వరకు రెండు బకెట్లు వేస్తేనే తమ కడుపు నిండుతుందని, కాంట్రాక్టర్ల విన్నపం మేరకు టీజీఎండిసి కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మగా మారి, కొత్త ఇసుక క్వారీల ప్రారంభం చేపట్టాల్సింది పోయి, సుమారు నాలుగు నెలల నుండి, కాంట్రాక్ట్ దక్కించుకున్న ఇసుక కాంట్రాక్టర్లు, ఇప్పటికీ కేటాయించిన గ్రామాల్లో భూముల కొనుగోళ్ల విషయం పేరుతో, కాలయాపన చేయడం, మరోవైపు కొన్ని ఇసుక రీచ్ లు ఇప్పటికే డంపింగ్ చేసి ఉన్నప్పటికీ, ఆ రీచ్ ల నుండి ఇసుక రవాణా చేయించకపోవడం, వెనుక దాగి ఉన్న రహస్యం, అదనపు బకెట్ కు అనుమతి ఇస్తేనే, ఇసుక రీచులన్నీ పెద్ద మొత్తంలో ప్రారంభించడం జరుగుతుందని, టి జి ఎం డి సి కు కాంట్రాక్టర్లు వివరించడం జరిగింది అని అందుకే కొత్త ఇసుక క్వారీల ప్రారంభం డంపింగ్ చేసిన ఇసుక రీచుల నుండి రవాణాకు ఆలస్యం చేయడం జరుగుతుంది.

నెలల నుండి డంపింగ్ చేసి ఉన్న లోడింగ్ కు సమీరా అంటున్న కాంట్రాక్టర్ లు.
మేడిగడ్డ బ్యారేజ్ పరిధిలో 14 ఇసుక రీచులకు 2014 సంవత్సరంలో 14 ఇసుక రీచులకు టెండర్ వేయడం జరిగింది. 14 క్వారీలు కూడా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆగస్టు 2014 నాటికి తమ కాంట్రాక్టర్ అగ్రిమెంట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ వీటిలో కేవలం రెండు ఇసుక క్వారీలు మాత్రం ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. మిగతా 12 ఇసుక రీచ్ లు వాటిలో మహాదేవపూర్ ఒకటి, రెండు, మూడు ,నాలుగు, బొమ్మ పూర్ పేరుతో నాలుగు, బ్రాహ్మణ పెళ్లి పేరుతో రెండు,ఎల్కేశ్వరం పేరుతో రెండు, బెంగులూర్, పేరుతో ఒకటి, వీటిలో సుమారు నాలుగు క్వారీలు డంపింగ్ పూర్తిచేసుకుని నెలలు గడుస్తున్నప్పటికీ, ఇసుక రవాణా చేయడానికి ససేమీరా అంటున్నారు కాంట్రాక్టర్, అలాగే మిగితా 8 ఇసుక రీచ్లు, ఇప్పటివరకు భూమి పేరుతో కాలయాపన చేయడం జరుగుతుంది. ఇలా ఇప్పటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ, ఇసుక క్వారీలు నిర్వహించకపోవడం, కాంట్రాక్టర్లపై టీజీఎండిసి తక్షణ చర్యలు తీసుకొని, ఇతరులకు కాంట్రాక్ట్ అప్పజెప్పి ఇసుక రవాణా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, టీజీఎండిసి కేవలం కాంట్రాక్టర్ల కొరకు శాఖ పని చేస్తుందనే విధంగా నేటి వరకు, గత సంవత్సరం, జూన్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమై జూలై నాటికి అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నప్పటికీ, నేటికి ఇసుక రవాణా కొనసాగడం జరగలేదంటే, టీజీఎండిసి నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్టా కాదా. కాంట్రాక్టర్లకు టీజీఎండిసి పరోక్షంగా సహకరిస్తుందని స్పష్టంగా కనబడుతుంది.

గత నెల రీచులన్నీ ఆన్లైన్ చేసిన, పట్టించుకోని కాంట్రాక్టర్.
ఇక టీజీఎండిసి పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే, టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ల ఇసుక క్వారీల పేర్లను టీజీఎండిసి గత నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు సుమారు 15 రోజులు,ఆరు రిచులపేర్లు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కానీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా టీఎస్ఎండిసిని పట్టించుకోకపోవడంతో టీజీఎండిసి ఇసుక రీచుల పేర్లను ఆన్లైన్ లో పెట్టడం నిలిపివేసింది. టీజీఎండిసి ఆన్లైన్లో పెట్టిన ఇసుక రీచుల పేర్లు ఇవే, మహాదేవపూర్ ఒక్కటి, ఎలికేశ్వరం ఒక్కటి, బొబ్బాపూర్ రెండు, బొమ్మపూర్ 3, బొమ్మపూర్ నాలుగు, మహాదేవపూర్ నాలుగు, టీజీ ఎంబీసీ అధికారుల ఆదేశాలు కాంట్రాక్టర్ల వద్ద ఎంత విలువతో ఉన్నాయో దీన్నిబట్టి అర్థమవుతుంది. మహాదేవపూర్ వన్ క్వారీలో ఇసుక నాలుగు నెలల నుండి స్టోర్ ఉన్నప్పటికీ రవాణాకు టీఎస్ ఎండిసీ ఆదేశాలకు రిజెక్ట్ చేసిన కాంట్రాక్టర్, మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న పలువుల ఎనిమిది ,పలుగుల తొమ్మిది, మహాదేవపూర్ పుసుపుపల్లి, ఇసుక రిచుల్లో ఇసుక అక్రమాల వ్యవహారం అక్రమ వసూళ్ల దందా, మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతున్నప్పటికీ, టీజీఎండిసి అధికారులకు వాటిపై చర్యలకు ధైర్యం లేకుండా పోయింది. ఇప్పటికీ ఇసుక రీచ్ లో స్టాక్ చేసి ఉన్న ఇసుక రవాణాకు ఆదేశాలు ఇవ్వాల్సిన టిజిఎండిసి ఇసుక కుప్పలను తమాషాగా చూస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రారంభించి సగానికి పై ఇసుక క్వాంటిటీని రవాణా చేయాల్సిన టి జి ఎం డి సి, కేవలం కాంట్రాక్టర్లకు అక్రమ సొమ్మును దోచిపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న అధికారులవ్యవహారం, ప్రభుత్వ నూతన ఇసుక పాలసీ విధానానికి తూట్లు పొడుస్తూ, కేవలం కాంట్రాక్టర్ల వద్ద మెప్పు పొంది అక్రమ సొమ్ము కాంట్రాక్టర్లతో పాటు తాము కూడా పోగు చేసుకుందామని ఒక చీకటి ఒప్పంద లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతుందని స్పష్టంగా కనబడుతుంది. ఇలా టీజీఎండిసి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి వంద శాతం చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారంతో టీజీఎండిసి బండారం బయటపడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి కింది స్థాయి నుండి ఉన్నత అధికారి వరకు తక్షణమే ఇసుక రీచులు ఇప్పటివరకే ప్రారంభించకుండా ఉండడానికి కారణం, ప్రస్తుతం కొనసాగుతున్న ఇసుక రీచ్ లో అక్రమాల వ్యవహారంపై విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.