గంగుల కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటులో మొక్కలు నాటిన నాయకులు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చేట్టిపెళ్లి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో మొక్కలు నాటడం జరిగినది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పరిచిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ అని నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ప్రజల సమస్యల పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకులని కొనియాడారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుంచిన నాయకులని వారు చేసిన సేవలు, చేస్తున్న పనులు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేరని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈకార్యక్రమంలో కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, మహిళా విభాగం మండల నాయకురాలు స్వప్న, వరలక్ష్మి, లత, బిఆర్ఎస్ నాయకులు రవీందర్, కనకచారి, సలీం, వాజీత్, సూర్యనారాయణ, శశి, ఆకాష్ రెడ్డి, మహేష్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.