శ్రీ గురుకులంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని లక్నపల్లి గ్రామ శివారులో గల శ్రీ గురుకుల విద్యాలయంలో 2012 సంవత్సరంలో పదవతరగతి.చదివిన
విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూర్వ విద్యార్థులంతా తమ విధేయుడు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి చదువుకున్న పాఠశాలలో ఒకేవేదికపైకలుసుకోని పాత జ్ఞాపకాలు నెమలి వేసుకున్నారు ఒకరిని ఒక అలింగం చేసుకుంటూ ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాటి ఉపాధ్యాయుల మంచి ఆలోచనలు, ప్రణాళికలతోనే తమ ఉన్నత స్థాయిలో స్థిరపడ్డామని ఒకనివ్వదు తమ స్థాయిలో అని చెప్పుకుంటూ ఆనందపడ్డారు. ఈ సందర్భంగా తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను మెమొంటో,శా లువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ గురుకులం ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడి సమాజానికి సేవలు అందించినప్పుడే చదువు నేర్పిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆనందం లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు మేడి.రమేష్, వెంకటరమణ,కామని.రమేష్ ,కోటేశ్వరరావు, కనుకయ్య, కవిత ,సునిత, రాంబాబు విద్యార్థులు పాల్గొన్నారు.