ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన పాత్రికేయలు
రెనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రొ.బంగారి స్వామి
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలోని పరిసర ప్రాంతాల పేద ప్రజలకు వైద్యం అందాలనే ఉద్దేశంతో ఈనెల 4వ తేదీన నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రేనే హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం కావడంలో ఆ పాత్రికేయుల కృషి ఎంతో విలువైనదని రేనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం నస్పూర్ & శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు భూపతి రవి, కొండ శ్రీనివాస్ లతో పాటు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వైద్య శిబిరానికి చేసిన సౌకర్యవంతమైన ఏర్పాట్లు శిబిరం విజయవంతం కావడానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.మండు వేసవిలో కూడా మా వైద్యులకు, సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లకు రుణపడి ఉన్నామన్నారు.ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన రావడానికి,అతి తక్కువ సమయంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించి ప్రత్యేక వన్నె తీసుకువచ్చారని కొనియాడారు.ముఖ్యంగా మా సిబ్బందికి మీరిచ్చిన సహకారం మరువలేనిది, రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి వైద్య సేవా కార్యక్రమాల్లో మేము మీ వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. ఎటువంటి ఆరోగ్య సేవ కార్యక్రమాలకైనా మా రెనే హాస్పిటల్ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.