నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పెగళ్ళపాటి
వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన గోవిందు పుష్ప అనే నిరుపేద మహిళ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. కాగా కడు నిరుపేదలైన మృతురాలి కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు, కర్మకాండల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గీసుకొండ గ్రామానికి ఆమె బంధువులు, గీసుకొండ గ్రామ శ్రీమంతుడు, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణకు తెలిపి సహాయం కోరారు.కాగా మానవత్వంతో స్పందించిన లక్ష్మీనారాయణ వెంటనే రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ నగదును ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి, మృతురాలి బంధువులు ఇనుముల ప్రభాకర్, కోట అయిలయ్య, అశోక్, రాజు, బరిగెల యాకూబ్ కలిసి మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈకార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.