మండల బీజేపీ అధ్యక్షులుగా గోపాల్ నాయక్ నియామకం
బాలానగర్ నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షులుగా.. మండలంలోని సూరారం గ్రామపంచాయతీ శంకరాయపల్లి తండాకు చెందిన పాత్లావత్ గోపాల్ నాయక్ సోమవారం నియామకమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలుపొందేందుకు కృషి చేస్తానన్నారు. మండల అధ్యక్షుడుగా నియమించినందుకు ఎంపీ డీకే అరుణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గోపాల్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు.