కులగణన పై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

BC

కులగణన పై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో
దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ,దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని ,బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని ,కేంద్రంలో బీసీలకు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అనేక దశాబ్దాలుగా బీసీలుగా ఉద్యమిస్తున్నామని అన్నారు. దేశంలోని అనేకమైన ఓ బి సి సంఘాలు, ప్రజాసంఘాల పోరాటo, ఉద్యమాల వల్ల కేంద్ర ప్రభుత్వం తలోగ్గి బీసీ కులగనన నెరవేరుస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగనన డిమాండ్ ను జాతీయస్థాయిలో ఒక ఎజెండా అంశంగా తీసుకొచ్చారని అందుకు రాహుల్ గాంధీ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
11 సంవత్సరాల నుండి బీసీల కొరకు ఒక్క మంచి పని కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేయలేదని, ఏ గణనా బీజేపీ చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయమని,కేంద్ర ప్రభుత్వానికి, పి ఎం నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం సామాజిక రిజర్వేషన్లపై 50% రిజర్వేషన్ ఎత్తివేయాలని, తెలంగాణలో 42 శాతం, బీహార్లో 65 రిజర్వేషన్ కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేని మల్లేష్ యాదవ్,పట్టణ అధ్యక్షుడు కమలాకర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బోప్పదేవయ్య ,సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడ్క కమలాకర్,ఇల్లంత కుంట తిరుపతి , బచ్చు ప్రసాద్ ,సామల తిరుపతి,కొండ విజయ్,తొట్ల మల్లేశం,తొట్ల మల్లేశం,రోహిత్ యాదవ్ ,కొండయ్య,దామోదర్ ,శ్రీనివాస్ ,నరేందర్,శ్రీధర్ తదితరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!