ఉగ్రవాదుల దాడి అమానుషం.

Terrorist attack Terrorist attack

ఉగ్రవాదుల దాడి అమానుషం

సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో సామాన్యులపై ఉగ్రదాడిని ఖండిస్తున్నామని, ఈ సంఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపి ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలని సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో జాతీయ అవార్డు గ్రహీత గోకా రామస్వామి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో డాక్టర్ పరికిపండ్ల అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, స్థానికులు జెండాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జం ప్రభాకర్, భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడేపూ రాజేంద్రప్రసాద్, వారణాసి మోహన్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ,శుభ లతోపాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!