కర్రెగుట్టలలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి.

Central forces Central forces

కర్రెగుట్టలలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి

ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ లు ముంజాల బిక్షపతి గౌడ్, మాదాసి సురేష్.

ములుగు జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల బారీ ర్యాలీ..

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్.

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి.

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి/ ములుగు,నేటిధాత్రి:

 

 

కర్రెగుట్టలలో మోహరించిన కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రజాసంఘాల జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్, హనుమకొండ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు.ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా బుధవారం దళిత,గిరిజన,ఆదివాసి,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేలాదిమందితో భారీ ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విలువైన కనజ సంపదను సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసమే ఆపరేషన్ కాగలరు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని వారు విమర్శించారు.తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు సోమ రామ్మూర్తి, సాయిని నరేందర్,వట్టంఉపేందర్, బొట్ల బిక్షపతి,జై సింగ్ రాథోడ్,తెలంగాణ కొమురయ్య, కర్ణాటకపు వావిలాల లక్ష్మణ్, మోరే ఐలయ్య, అమ్ముల అశోక్,మాదాసు జితేందర్ తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!