రాష్ట్ర కాంగ్రెస్ యువజన విస్తృత స్థాయి సమావేశం.

Congress Congress

రాష్ట్ర కాంగ్రెస్ యువజన విస్తృత స్థాయి సమావేశం
పాల్గొన్న జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
బుడిగె శ్రీకాంత్
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగ శ్రీకాంత్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జెక్కిడి చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఎస్ వి ఎల్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం రోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రానున్న దేశ భవిష్యత్తు యువతదే అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి యువజన కాంగ్రెస్ కృషి మరువలేనిది అన్నారు దేశంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారాలతో రెచ్చగొడుతూ తమ రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దీనివల్ల ఎంతో మంది పేద ప్రజలు అమాయక ప్రజలు బలైపోతున్నారని వాపోయారు మోడీ నిరంకుశ పరిపాలనకు యువత త్వరలోనే చరమగీతం పాడి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ని ప్రధానిగా చూస్తామని తెలిపారు యువజన కాంగ్రెస్ కు సీనియర్ కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని సీనియర్ కాంగ్రెస్కు యువజన కాంగ్రెస్ కుండకాయ లాంటిదని కొనియాడారు . అనంతరం ఉగ్రదాడిలో మరణించిన భారతీయులకు సంతాపం తెలిపారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువజన కాంగ్రెస్ జాతీయ ఇన్చార్జ్ శ్రీ కృష్ణ అల్లవారు యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపీపీ సీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీనగర్ ఇన్చార్జి మధు యాష్ గౌడ్ , రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రవణ్ రావు, టిపిసిసి ప్రతినిధి జక్కడి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!