బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం.!

silver jubilee silver jubilee

బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
బిఆర్ఎస్ అయినవోలు మండల పార్టీ పిలుపు
నేటి ధాత్రి అయినవోలు హనుమకొండ:-

బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతొత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ అయినవోలు మండల కన్వీనర్ తక్కలపల్లి చందర్రావు వర్కింగ్ ప్రెసిడెంట్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఐనవోలు మండలంలోని ప్రతి గ్రామం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభను తరలి వెళ్లి విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం నరకావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అందుకే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోసం యువత మరియు రైతన్నలు ప్రతి ఒకరు రజతోత్సవ సభకు తండోపతండాలుగా రావడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరై మన సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు జడ్పి కో.ఆప్షన్ నెంబర్ ఉస్మాన్ అలీ మాజీ సర్పంచులు పల్లకొండ సురేష్ కావటి స్వామి బరిగల సదానందం కంజర్ల రమేష్ మండల నాయకులు మర్పట్ల దేవదాస్ తీగల లక్ష్మణ్ గౌడ్, పఠాపురం ఎల్ల గౌడ్ దుపెళ్లి కొమురయ్య గడ్డం రఘు వంశీ గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమారస్వామి ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!