వేసవి కాలంలో ప్రకృతి సోయగం
కనువిందు చేస్తున్న ముదిగుంట రహదారి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట, కాన్కూర్ మార్గంలో కనువిందు చేస్తున్న రహదారి వనాలు.
ముదిగుంట రహదారి నుండి ప్రయాణించే వాహనాదారులు ఈ ప్రకృతి వనాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇంత మండు వేసవి కాలంలో కూడా ఈ చెట్లు ఒకదానికి ఒకటి అల్లుకొని చల్లదనాన్ని ఇస్తూ రహదారి వెంట పూలవనంతో చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఇలాంటి ఆహ్లదమైన వాతావరణాన్ని పకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు.